"చంపేస్తాం.." : న్యాయమూర్తులకు దుబాయ్ గ్యాంగ్ బెదిరింపులు 

Published : Jul 25, 2023, 05:38 AM IST
"చంపేస్తాం.." : న్యాయమూర్తులకు దుబాయ్ గ్యాంగ్ బెదిరింపులు 

సారాంశం

కర్ణాటక హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులకు ప్రాణాలు తీస్తామంటూ దుబాయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు వచ్చాయి. జడ్జీల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనతోపాటు ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ ఒక అంతర్జాతీయ ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌కు సందేశం వచ్చిందని  పీఆర్‌వో మురళీధర్‌ తెలిపారు. 

కర్ణాటక హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులకు ప్రాణాలు తీస్తామంటూ దుబాయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు వచ్చాయి. జడ్జీల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనతో పాటు పలువురు తమ ప్రాణాలకు హని ఉందని కర్ణాటక హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్ఓ) మురళీధర్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో సెంట్రల్ CEN క్రైమ్ పోలీసులు తెలియని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జూలై 12వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో అతనికి అంతర్జాతీయ నంబర్ నుండి వాట్సాప్ మెసెంజర్‌లో సందేశాలు వచ్చాయి.  
 
హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో పంపిన సందేశాల్లో మురళీధర్‌తో పాటు జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) సహా హైకోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులకు దుబాయ్‌కి చెందిన ముఠా ద్వారా హత్య బెదిరింపులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

సందేశంలో ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు, బెదిరింపులు కూడా ఉన్నాయి. జులై 14న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పాకిస్థాన్‌లోని ఓ బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు  చెల్లించాలని బెదిరింపు సందేశంలో డిమాండ్ చేశారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 506, 507, 504, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 75, 66 (ఎఫ్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu