త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుంది: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

Published : Dec 06, 2022, 07:54 PM IST
త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుంది: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

సారాంశం

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్ లెస్ అవుతుందని అన్నారు. ఈ మేరకు న్యాయశాఖ అధికారులతో ఇది వరకే చర్చించానని, త్వరలోనే సీజేఐ చంద్రచూడ్‌తో సమావేశం కాబోతున్నట్టు వివరించారు.  

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుందని వివరించారు. దీనిపై ఇది వరకే న్యాయశాఖ అధికారులతో చర్చించానని చెప్పారు. ఇ-కోర్టు ప్రాజెక్టు ఎలా ప్రారంభం కానుంది? ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై సమగ్రంగా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు.

జ్యూడీషియల్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని జోడించి మార్పులు తీసుకురావడమే ఇ-కోర్టుల ప్రాజెక్టు లక్ష్యం అని వివరించారు. కాబట్టి త్వరలోనే తాను సీజేఐ డీవై చంద్రచూడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన బృందంతో సమావేశం కాబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఇ-కమిటీ చైర్‌పర్సన్‌గా దిగిపోవడానికి ముందు అన్ని సమస్యలను పరిష్కరించాలని తాను సీజేఐ డీవై చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

Also Read: ప్రతి పౌరుడికి న్యాయం అందాలి.. కోర్టుల వద్దకు ప్రజలు కాదు.. ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలి: సీజేఐ

కేసుల పెండింగ్ విషయంపై మాట్లాడుతూ మొత్తం పెండింగ్ కేసులు సుమారు 5 కోట్ల వరకు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ స్థాయిలో పెండింగ్ కేసులు ఉండటం బాధాకరం అని పేర్కొంటూ వాటన్నింటికీ సింగిల్ విండో  ప్లాట్‌ఫామ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu