సింహాలతో ఆట.. మూడు సింహాల వెంట నడిచి వెళ్లుతున్న మహిళ వీడియో వైరల్

By Mahesh KFirst Published Dec 6, 2022, 7:27 PM IST
Highlights

మూడు సింహాలతో వెంట నడుచుకుంటూ ఓ మహిళ వెళ్లుతున్నది. ఆమెలో ఎంతమాత్రం భయం లేదు. చాలా సాధారణంగా వాటిని నడుస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
 

న్యూఢిల్లీ: సింహం గాండ్రింపు చాలు వణికిపోవడానికి.. నిజంగా దాన్ని చూస్తే గుండెలు అదిరిపోతాయి. అంతేనా, అడవిలో స్వేచ్ఛగా ఉన్న సింహాల మధ్య నిలబడటానికి, వాటి వెంట నడిచి చాలా సాధారణంగా వెళ్లడానికి ఇంకెన్ని గుండెలు కావాలి మరి. అందుకే కాబోలు ఆ మహిళ వీడియో తెగ వైరల్ అవుతున్నది. నమ్మశక్యంగా లేని ఆ వీడియో పై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.

జెన్ అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆమె ఇన్‌స్టా గ్రామ్ ఫీడ్ మొత్తం సింహాల వీడియోలతో నిండిపోయి ఉన్నది. ఇందులో ఒక వీడియోలో మూడు సింహాలు నడుస్తూ వెళ్లుతున్నాయి. అయితే, వాటి వెనుకాలే ఓ మహిళ నడిచి వెళ్లుతున్నది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. చాలా సాధారణంగా నడిచి వెళ్లుతున్నది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

ఈ వీడియో పై అనేక రకాల రియాక్షన్లు వచ్చాయి. ఆ మహిళను వారి వెంట నడవడానికి సింహాలు అనుమతిస్తున్నాయని, కాబట్టి, ఆమె నిజంగా ఒక ప్రత్యేక మనిషి అయి ఉంటుందని కామెంట్ వచ్చింది.

మరొక యూజర్ కామెంట్ చేస్తూ ఆమె చాలా ధైర్యవంతురాలని కామెంట్ చేశారు. అయితే, ఎంత మచ్చిక చేసుకున్నా.. జంతువులో జంతు సహజాతాలు ఉంటాయని, ఏ క్షణంలో వాటిలో ఆ సహజాతాలు బయట పడితే ఒక్క సెకండ్‌లో ఆమెను చీల్చేస్తాయని పేర్కొన్నారు. కాబట్టి, సగం ధైర్యవంతురాలైనా.. సగం స్టుపిడిటీనే అని వివరించారు.

click me!