పహల్గాం ఉగ్రవాదులెక్కడ?: ప్రధాని మోదీకి జైరాం రమేష్ సూటిప్రశ్న

Published : May 21, 2025, 10:50 PM IST
Pahalgam terrorists

సారాంశం

పహల్గాం దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో జాప్యంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కేంద్రాన్ని నిలదీసారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్‌లను దారి మళ్లించే ప్రచార ప్రయత్నంగా కొట్టిపారేశారు.

బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర రాహుల్ గాంధీ "పాకిస్తాన్‌కు ఆక్సిజన్ ఇస్తున్నారు" అనే ఆరోపణపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల అరెస్టుపై జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

“పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవాలి. చైనా పాకిస్తాన్‌కు ఆక్సిజన్ ఇచ్చింది. చైనా సహాయం లేకుండా ఈ యుద్ధం చేయలేదు. ఈ భాగస్వామ్యం గురించి మేము ప్రశ్న లేవనెత్తాము.” అని అన్నారు. 

పాకిస్తాన్‌తో గతంలో బీజేపీ చేసిన ఒప్పందాలను గుర్తు చేశారు. "జిన్నాకు క్లీన్ చిట్ ఇచ్చి, ఆయనను ఎవరు ప్రశంసించారు? అది బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్. లాహోర్ బస్ యాత్ర ఎవరు చేపట్టారు? అటల్ బిహారీ వాజ్‌పేయి. నవాజ్ షరీఫ్‌తో ఎవరు అల్పాహారం తీసుకున్నారు? అది ప్రధాని నరేంద్ర మోడీ" అంటూ జైరాం రమేష్ గుర్తుచేసారు.

"పహల్గాం దాడి జరిగి ఒక నెల కావస్తోంది… ఇప్పటివరకు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారు… ఇంతకే వాళ్లు ఎక్కడ?'' అని జైరాం రమేష్ ప్రశ్నించారు. 

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ సమాజానికి తెలియజేయడానికి అఖిలపక్ష పార్టీ ప్రతినిధి బృందాలను పంపడం ప్రజలను ఏమార్చడానికే అనిఅన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించడానికి కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రశ్నించారు.

 "ఏప్రిల్ 22 నుండి కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు అఖిల పక్ష సమావేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రెండు సమావేశాలు జరిగాయి, కానీ ప్రధాని హాజరు కాలేదు. తరువాత తమ నేత రాహుల్ గాంధీ, ఖర్గే ప్రధానికి లేఖ రాసి దీని నుండి ఉత్పన్నమయ్యే రాజకీయ సమస్యలపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని కోరారు" అని ఆయన జోడించారు.

ఇదిలావుంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామ్య దేశాలకు ఏడు అఖిల పక్ష ప్రతినిధి బృందాలు భేటీ కానున్నాయి. కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జెడి(యు)కి చెందిన సంజయ్ కుమార్ జా, డీఎంకేకి చెందిన కనిమొళి కరుణానిధి, (ఎన్సీపీ-ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే ఈ ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coconut : ఫ్లైట్‌లో ఎండు కొబ్బరి పై నిషేధం ఎందుకు?
PM Modi Grand Roadshow: కేరళ పర్యటనలో మోదీకిగుర్తుండిపోయేలా ఘన స్వాగతం | Asianet News Telugu