ISRO: ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ గుర్తింపు

Published : Mar 04, 2024, 04:55 PM IST
ISRO: ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్ గుర్తింపు

సారాంశం

ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన రోజే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఓ రోటీన్ స్కాన్‌లో ఈ విషయం బయటపడిందని సోమనాథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడంచారు.  

ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్టు తెలిసింది. టార్మాక్ మీడియా హౌజ్‌లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సోమనాథ్ వెల్లడించారు. ఓ స్కాన్‌లో క్యాన్సర్ వ్రణం పెరుగుదలను గుర్తించినట్టు చెప్పారు. 

‘చంద్రయాన్ 3 మిషన్ సమయంలోనూ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ, వాటి గురించి నాకు స్పష్టమైన అవగాహన లేకుండింది’ అని సోమనాత్ తెలిపారు. ‘ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను ప్రయోగం చేపట్టిన రోజే నాకు క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఆ విషయం నాకే కాదు.. నా కుటుంబానికి, కొలీగ్స్‌కు కూడా షాకింగ్‌గా అనిపించింది’ అని వివరించారు.

సూర్యుడికి సంబంధించిన పలు పొరలను అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 అనే మన దేశపు తొలి సోలార్ మిషన్‌ను 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించారు. అదే రోజు ఎస్ సోమనాథ్ ఓ రోటీన్ స్కాన్ చేయించుకున్నారు. అందులో తన పొట్టలో ఓ అసాధారణమైన పెరుగుదల కనిపించింది. ఈ అసాధారణ రిజల్ట్‌తో ఆయన వెంటనే తదుపరి స్కానింగ్‌ల కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. తనలో క్యాన్సర్ ఉన్నట్టు అక్కడ ధ్రువీకరించారు. ఇది బయటపడిన రోజుల వ్యవధిలోనే తన వృత్తిగత బాధ్యతలను నెరవేర్చడానికి అనేక ఆరోగ్యపరమైన సవాళ్లు వచ్చాయి.

Also Read: Modi Ka Parivar: బీజేపీ నేతల ఎక్స్ బయోల్లో ‘మోడీ కా పరివార్’.. ఈ ట్రెండ్ ఎందుకో తెలుసా?

ఆ తర్వాత ఎస్ సోమనాథ్ కీమోథెరపీ ఆపరేషన్ చేయించుకున్నారు. ‘ఇది నిజంగా నా కుటుంబానికి ఒక షాక్ వంటిది. కానీ, ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉన్నదనే ఎరుకలో ఉన్నాను. దానికి పరిష్కారంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను’ అని సోమనాథ్ వివరించారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial