తనని తాను రక్షించుకోవడానికే ఎమర్జెన్సీ : ఇందిరా గాంధీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు 

Published : Mar 12, 2023, 01:22 AM IST
తనని తాను రక్షించుకోవడానికే ఎమర్జెన్సీ : ఇందిరా గాంధీపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు 

సారాంశం

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని డిఎంకె ఎం కరుణానిధి వ్యతిరేకిస్తున్నారని, దీంతో ఇందిరా గాంధీ ఆగ్రహనికి గురయ్యారని ఎంకె స్టాలిన్ అన్నారు. 

ఎమర్జెన్సీపై ఎంకే స్టాలిన్: ఎమర్జెన్సీ గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రస్తవించారు. మాజీ సీఎం కరుణానిధి..దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మాట వినలేదని అన్నారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించవద్దని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)ని అభ్యర్థించారని, అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎం. కరుణానిధి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం.. ఎమర్జెన్సీని వ్యతిరేకించారని, ఇది తన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ స్టాలిన్ అన్నారు. 

ఏ సందేశం పంపబడింది?

సభను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ..  1975లో విధించిన ఎమర్జెన్సీని  వ్యతిరేకించకూడదని, దానిని పట్టించుకోకుంటే డిఎంకె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామని కరుణానిధిని దివంగత ఇందిరాగాంధీ తన మనుషులను పంపారని చెప్పారు. అనంతరం చేపట్టిన  అన్నాడీఎంకే సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 4,000 మందికి పైగా డీఎంకేలో చేరారు.

'సెకన్‌లో ప్రభుత్వం పడిపోతుంది'

"సంక్షోభం నుండి తనను తాను రక్షించుకోవడానికి" ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారని, ఆ తర్వాత చాలా మందిని అరెస్టు చేశారని, చాలా మంది నాయకులపై కఠినమైన అంతర్గత భద్రతా చట్టం (మిసా) కింద కేసులు నమోదు చేశారని స్టాలిన్ అన్నారు. సీఎం స్టాలిన్ ఇంకా మాట్లాడుతూ..అప్పుడు తమిళనాడులో మాకు ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో కలైంజర్ (కరుణానిధి)కి ఢిల్లీ నుండి ఓ మెసేజ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించవద్దని, అలా చేస్తే (DMK) ప్రభుత్వం క్షణాల్లో పడిపోతుందని ప్రధాని ఇందిరా గాంధీ దూతలు ఆయనకు తెలియజేశారు. అయితే తన ప్రాణాన్ని కూడా పట్టించుకోనని, ప్రజాస్వామ్యమే తనకు ముఖ్యమని కరుణానిధి చెప్పుకొచ్చారు. అనంతరం మెరీనాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరుణానిధి తీర్మానం చేశారని, కానీ.. ఆ వెంటనే డీఎంకే ప్రభుత్వం బర్తరఫ్ అయిందని, అనంతరం పార్టీ నేతలను అరెస్టు చేశారని అన్నారు. 

ఎన్నికల గురించి ఏం చెప్పారు?

వచ్చే ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో (తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒకటి) విజయం సాధించేందుకు కృషి చేయాలని స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కోరారు. ఇటీవల జరిగిన ఈరోడ్‌ ఈస్ట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాన్ని అందించడం ద్వారా ప్రజలు ఎస్‌పీఏకు స్పష్టమైన ఆదేశాన్ని అందించారు. ఈరోడ్ ఈస్ట్ సీటులో విజయం తమిళనాడు ప్రజలకు అందించిన సుపరిపాలన, పథకాలకు అద్దం పడిందని, ఇందులో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు రూ.1000 అందజేస్తున్నట్లు తెలిపారు.

మతం, కులం పేరుతో గందరగోళం సృష్టించి హింసను రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకేను ప్రభుత్వం నుంచి గద్దె దింపాలన్నారని అన్నారు. మహాకూటమి మొత్తం 40 సీట్లు గెలిస్తే.. తగిన సమాధానం చెబుతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూటమి భాగస్వామ్య పక్షాల గెలుపునకు డీఎంకే పని చేస్తుందన్నారు. అధికారం కోసం కాదని, పేద, బడుగు, రైతులకు సేవ చేసేందుకు పార్టీ ఆవిర్భవించిందని, 2021లో ఆరోసారి అధికారంలోకి రాకముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని అన్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?