India UK Free Trade Agreement: భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లాభాలేంటి?

Published : May 06, 2025, 09:11 PM IST
India UK Free Trade Agreement: భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లాభాలేంటి?

సారాంశం

India UK Free Trade Agreement: భారత్, UK మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.విస్కీ, కార్లు లాంటి వస్తువులపై పన్ను తగ్గింపు ఉంటుంది. ఈ ఒప్పందం రెండు దేశాలకూ ఆర్థికంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు.

India UK Free Trade Agreement: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ మంగళవారం బిలియన్ పౌండ్ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పూర్తి చేసినట్లు ప్రకటించాయి. 2022లో ప్రారంభమైన చర్చలు తాజా ఒప్పందంతో సక్సెస్ అయ్యాయి. దీంతో సుంకాల్లో గణనీయమైన తగ్గింపు, మెరుగైన మార్కెట్ యాక్సెస్, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపుతో ఈ ఒప్పందం రెండు దేశాలకు భారీ ఆర్థిక అవకాశాలను అందిస్తుంది.

90 శాతం సుంకాల తగ్గింపును ఈ ఒప్పందంలో ఉంటుంది. 2040 నాటికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు ఏటా అదనంగా 4.8 బిలియన్ పౌండ్లు చేకూరుతుందని అంచనా. భారత్ కు అనేక విషయాల్లో లాభం కలగనుంది. 

ఇండియా-యూకే ఒప్పందం

భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. FTA ఇప్పుడు చట్టపరమైన పరిశీలన దశకు వెళ్తుంది, ఆ తర్వాత ఆమోదం కోసం బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పిస్తారు. ఇది అంతా కూడా లాంఛనమే. 

“నా మిత్రుడు PM @Keir_Starmerతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. చారిత్రాత్మక మైలురాయిగా, భారత్, UK విజయవంతంగా ఒక ప్రతిష్టాత్మకమైన, పరస్పరం ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి” అని మోడీ సోషల్ మీడియా వేదిక Xలో పోస్ట్ చేశారు. “ఈ ఒప్పందాలు మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయి, వాణిజ్యం, పెట్టుబడి, వృద్ధి, ఉద్యోగ సృష్టి, ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తాయి. PM స్టార్మర్‌ను త్వరలో భారతదేశానికి స్వాగతించాలని ఎదురుచూస్తున్నాను” అని ఆయన అన్నారు.

 

 

ఈ వ్యాపార ఒప్పందంతో యూకే, ఇండియా రెండింటికీ ఆర్థికంగా పెద్ద విజయం అని చెప్పాలి. మూడేళ్ల తర్వాత ఇండియా, UK మధ్య ఈ ఒప్పందం కుదిరింది. విస్కీ, కాస్మెటిక్స్, వైద్య పరికరాలపై ఇండియా పన్నులు తగ్గుతాయి. UK ఎగుమతులపై 90% సుంకాలు తగ్గుతాయి. దీంతో UKలో ఉద్యోగాలు పెరుగుతాయి.

ఇండియా పన్నులు తగ్గుతాయి. 90% సుంకాలు తగ్గుతాయి. వీటిలో 85% పదేళ్లలో పూర్తిగా సుంకం లేకుండా అవుతాయి. పదేళ్లలో విస్కీ, జిన్ సుంకాలు 150% నుంచి 75%కి, ఆపై 40%కి తగ్గుతాయి. కార్ల సుంకాలు 100% పైగా నుంచి 10%కి తగ్గుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల చర్యల వల్ల ఏర్పడిన గందరగోళం ఈ రెండు దేశాలను ఒప్పందం వైపు నడిపించింది.

ఇండియా - UK 2040 నాటికి 34 బిలియన్ డాలర్ల వ్యాపారం


ప్రపంచంలో ఐదో, ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన UK, ఇండియా మధ్య ఈ ఒప్పందం మూడేళ్ల చర్చల తర్వాత కుదిరింది. 2040 నాటికి రెండు దేశాల మధ్య వ్యాపారం 34 బిలియన్ డాలర్లు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌కు కీలక విజయాలు

ఒప్పందంలో భాగంగా భారత్ తన దీర్ఘకాలిక డిమాండ్లను సాధించింది:

  • UKలో పనిచేసే భారతీయ నిపుణులు (వైస్ వెర్సా) రెండు దేశాల్లోనూ జాతీయ భీమా లేదా సామాజిక భద్రతా సహకారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్ నిర్ధారిస్తుంది.
  • UK తన వలస విధానం మారదని నొక్కి చెప్పినప్పటికీ, వ్యాపార చలనశీలత ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అంగీకరించింది, దీని వలన నిపుణులు రెండు దేశాల మధ్య తరలించడం సులభం అవుతుంది.
  • అదనంగా, UK వీసా మార్గాల కింద చెఫ్‌లు, సంగీతకారులు, యోగుల కోసం కొత్త ప్రొఫెషనల్ వీసా విభాగాలను భారత్ పొందింది.

ఈ కొత్త ఒప్పందం ద్వారా UKకి కీలక ప్రయోజనాలు:

పన్ను తగ్గింపులు:
స్కాచ్ విస్కీ: పన్నులు 150% నుంచి 75%కి తగ్గుతాయి.

కార్లు: పన్నులు 100% నుంచి 10%కి తగ్గుతాయి.

ఇతర వస్తువులు: జిన్, వైద్య పరికరాలు, యంత్రాలు, మేక మాంసంపై కూడా పన్ను తగ్గింపులు ఉంటాయి.

ఈ పన్ను తగ్గింపులు 2022 వ్యాపార గణాంకాల ప్రకారం 400 మిలియన్ పౌండ్ల విలువైనవి. ఇది పదేళ్లలో 900 మిలియన్ పౌండ్లకు రెట్టింపు అవుతుందని UK వాణిజ్య శాఖ అంచనా వేసింది.

UK ప్రధాని కీర్ స్టార్మర్ ఏమన్నారంటే?

UK, ఇండియా మధ్య విప్లవాత్మక వ్యాపార ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాల ప్రజలకు, పరిశ్రమలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.

 

 

బోరిస్ జాన్సన్ హయాంలో ప్రారంభం:
ఈ ఒప్పందం చర్చలు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో ప్రారంభమయ్యాయి. 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ, పన్ను సమస్యలు, UKలో రాజకీయ మార్పుల వల్ల ఆలస్యమైంది.

UK పర్యటన పీయూష్ గోయల్:
ఇండియా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల రెండుసార్లు UK వెళ్లి, UK వాణిజ్య మంత్రి జోనాథన్ రెనాల్డ్స్‌తో కీలక సమావేశాలు నిర్వహించారు. దీంతో ఒప్పందం ఖరారైంది.

ఇండియాకు UKలో ఉద్యోగాలు:

ఇండియా, UK మధ్య ఇప్పటికే ఉన్న బలమైన వ్యాపార సంబంధాలను ఈ FTA మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ద్వైపాక్షిక వ్యాపారం సంవత్సరానికి 41 బిలియన్ పౌండ్లు, కొత్త ఒప్పందం దీన్ని 25.5 బిలియన్ పౌండ్లు పెంచుతుందని అంచనా.

FTA దీర్ఘకాలంలో UK కార్మికులకు 2.2 బిలియన్ పౌండ్ల అదనపు వార్షిక వేతనం ఇస్తుందని UK అధికారులు అంచనా వేశారు.

“FTAలు చాలా సంక్లిష్టమైనవి. ఇది నిజంగా రెండు దేశాలకూ ఉపయోగపడే ఒక గొప్ప విజయం. ఈ ఒప్పందం UK-ఇండియా సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మా భాగస్వామ్య సామర్థ్యాన్ని, రాబోయే అవకాశాలను చూపిస్తుంది” అని UKలోని ఇండియా గ్లోబల్ ఫోరం (IGF) వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మనోజ్ లడ్వా PTIకి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu