India Pakistan War : పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్ ... ఎలాగో తెలుసా?

శుక్రవారం రాత్రి పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ దాడులను ఇండియా విజయవంతంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ విమానాశ్రయంతో సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. కానీ భారత్ ముందుగానే అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.  

Google News Follow Us

India Pakistan War : శుక్రవారం రాత్రి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ దాడులను ఇండియా విజయవంతంగా అడ్డుకుంది. శ్రీనగర్ విమానాశ్రయం వంటి వ్యూహాత్మక ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. వైమానిక దాడులు చేయడానికి పాకిస్తాన్ పౌర విమానాలను ఎంచుకుంటోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పౌర విమానాలను ప్రమాదంలో పడేసిందని భారత ప్రభుత్వం ఆరోపించింది.

ఉత్తరాన బారాముల్లా నుండి దక్షిణాన భుజ్ వరకు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LoC) రెండింటిలోనూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగాయి. పాకిస్తాన్‌లోని బహుళ ప్రదేశాల నుండి ప్రయోగించిన డ్రోన్‌లు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, భారత దళాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

"విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు వంటి ప్రదేశాలపై జరిగిన డ్రోన్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాం" అని సైనిక అధికారులు తెలిపారు. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, జైసల్మేర్, భుజ్ వంటి ప్రదేశాలు దాడులకు గురయ్యాయి.

ఫిరోజ్‌పూర్‌లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక సాయుధ డ్రోన్ దాడి చేయడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.  భద్రత బలగాలు ఆ ఇంట్లో డ్రోన్ శకలాలను సేకరించినట్లు అధికారులు ధృవీకరించారు.

 

శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడులను శుక్రవారం అర్ధరాత్రి విజయవంతంగా అడ్డుకున్నారు. జమ్మూ, దక్షిణ కాశ్మీర్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు శ్రీనగర్‌లోని రక్షణ అధికారులు తెలిపారు.

వరుసగా రెండో రాత్రి, పాకిస్తాన్ నుండి వైమానిక ముప్పును గుర్తించడంతో సైరన్లు మోగడంతో అనేక సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయుధ దళాలు వెంటనే వాటిని అడ్డుకున్నాయి.

శ్రీనగర్, జమ్మూ నుండి పంజాబ్ వరకు సరిహద్దు జిల్లాలు, జైసల్మేర్, జోధ్‌పూర్‌తో సహా రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు మళ్లీ చీకట్లోకి వెళ్ళిపోయాయి.. పాక్ దాడుల నేపథ్యంలో బ్లాకవుట్ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా లైట్లు ఆర్పివేయాలని ప్రజలకు ప్రకటనలు చేశారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సుచెత్‌గఢ్, రామ్‌గఢ్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ కాల్పులు జరుగుతున్నాయి.

పౌర విమానాలను కవచంగా వాడుకుంటున్న పాక్

పవిత్రమైన ప్రార్ధనా స్థలాలపై పాకిస్తాన్ దాడిని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఖండించారు. భారత సాయుధ దళాలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన స్పందించారు. అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేయాలనే ఇస్లామాబాద్ దురుద్దేశాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

అమృత్‌సర్‌లోని గురుద్వారాపై పాకిస్తాన్ దాడి, ఆ తర్వాత భారత సైన్యాన్ని ఇరికించే ప్రయత్నాల గురించి మిస్రీ ప్రస్తావించారు. భారతదేశం తన సొంత నగరాలపై దాడి చేస్తుందని పాకిస్తాన్ చెప్పడం పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. పాకిస్తాన్ మాత్రమే ఇలాంటి కట్టుకథలు అల్లగలదని అన్నారు.

ఇటీవల భారత స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసే ప్రయత్నం చేసేటప్పుడు పాకిస్తాన్ తన పౌర విమానాలను "కవచంగా" ఉపయోగించిందన్నారు. ఈ దాడులు భారతదేశం నుండి వేగవంతమైన ప్రతిస్పందనను రేకెత్తిస్తాయని పూర్తిగా తెలిసినప్పటికీ గగనతలాన్ని మూసివేయలేదని సైనిక అధికారులు గుర్తించారు.

 

Read more Articles on