‘‘భారత్ వైరుధ్యాలకు వేదిక.. భిన్నమతాల కలయిక’’- రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Published : May 21, 2022, 03:44 PM ISTUpdated : May 21, 2022, 03:49 PM IST
‘‘భారత్ వైరుధ్యాలకు వేదిక.. భిన్నమతాల కలయిక’’- రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సారాంశం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారతదేశ వైవిధ్యాన్ని ప్రశంసించారు. దేశంలో పూరతమైన చర్చి ఉందని, అలాగే ఇక్కడే 72 ముస్లిం మతాలు జీవిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇది కనిపించదని చెప్పారు.

భారతదేశం ఆహ్లాదకరమైన వైరుధ్యాలకు వేదిక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భిన్న మ‌తాల క‌ల‌యిక‌తో ఉన్న‌ప్ప‌టికీ ప్రజల మధ్య సంఘర్షణకు తావివ్వలేదని తెలిపారు. ఏ నాగరికత కూడా తన సొంత సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకోకుండా, అర్థం చేసుకోకుండా గొప్పదిగా మారబోద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. 

గుజ‌రాత్ లోని వడోదర నగరంలోని కరేలిబాగ్ ప్రాంతంలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంలో శుక్ర‌వారం ‘‘సంస్కార్ అభయడే శివార్’’ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న యువ భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ‘‘ మన దేశ వైవిధ్యం ఎప్పుడూ సంఘర్షణలకు కారణం కాలేదు. ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన ప్రజలు సామరస్యంగా జీవించే ఏకైక దేశం భారతదేశం. ఇక్క‌డ 72 శాఖల ముస్లింలు ఉన్నాయి. ఇది ఇంత పెద్ద సంఖ్య‌లో ముస్లిం శాఖ‌లు ఎక్క‌డా లేవు. అలాగే ఈ దేశంలో అత్యంత పురాతనమైన చర్చి కూడా ఉంది. ’’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వివక్ష.. దళిత మహిళ వండిన భోజనాన్ని తిరస్కరించిన విద్యార్థులు.. కలెక్టర్ ఏం చేశాడంటే?

భారతదేశ ఆహ్లాదకరమైన వైరుధ్యాలు ఉన్న దేశం అని, సంభాషణలు మన సంస్కృతికి వెన్నెముక అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సమాజాన్ని, దేశాన్ని తనకంటే ముందు ఉంచే వ్యక్తులు భారతదేశానికి అవసరమని నొక్కిచెప్పిన ఆయన, యువతలో ఇలాంటి విలువలను పెంపొందించినందుకు స్వామినారాయణ్ శాఖను ప్రశంసించారు. కొత్త జీవనశైలిని అవలంబించినట్లే సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించాలని ఆయన యువతను కోరారు. 

‘‘భారతదేశం గతంలో విశ్వగురువు (ప్రపంచ నాయకుడు) గా ఉండేది. కొత్త అధ్యాయాలను రచించి, కొత్త ఎత్తులను సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. బాహ్య ప్రభావం మన సంస్కృతిని నాశనం చేయకుండా కూడా మనం చూసుకోవాలి. ప్యాంట్లు, చొక్కాల మాదిరిగానే మనం ధోతీ, కుర్తాలను గర్వంగా ధరించాలి. కోడింగ్ నేర్చుకోవడంతో పాటు, వేదాలు, పురాణాలలో ప్రావీణ్యం పొందడానికి కూడా మనం కృషి చేయాలి’’ అని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి అన్నారు.  గతంలో విజ్ఞానం, విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాల బానిసత్వం మన గొప్ప గతాన్ని మరచిపోయేలా చేసిందని తెలిపారు. 

కాగా.. రాజ్ నాథ్ సింగ్ శుక్ర‌వారం పూణేలో జరిగిన బీజేపీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న యువ‌కులను ఉద్దేశించి మాట్లాడారు. ఏ దేశం భ‌విష్య‌త్తు అయినా దాని యువ‌త‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు. ఎందుకంటే దేశానికి ఆ యువ‌తే బ‌లం, ఉత్ప్రేరకం, మార్పున‌కు మూలం అని అన్నారు. ప్రఖ్యాత కాలమిస్ట్ థామస్ ఫ్రైడ్‌మాన్ రాసిన కథనాన్ని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. ఈ కథనం తీవ్రవాద సంస్థ అల్-ఖైదా, భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌ల మధ్య భేదాల‌ను ఎత్తి చూపింద‌ని అన్నారు. ఇందులో ఇద్దరూ విద్యావంతులైన యువకులు త‌మ లక్ష్యం కోసం నిబద్ధతతో పని చేస్తున్నార‌ని తెలిపారు. అల్‌ఖైదాతో సంబంధమున్న యువకులు హత్యలలో పాల్గొంటుండగా, ఇన్ఫోసిస్ బృందం మానవాళి అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని రక్షణ మంత్రి చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations