మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై తక్షణం దృష్టి పెట్టాలి - ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్

Published : Jun 17, 2023, 03:26 PM IST
 మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై తక్షణం దృష్టి పెట్టాలి - ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్

సారాంశం

మణిపూర్ లో శాాంతి భద్రతలు క్షీణించిపోయాయని ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే  అత్యున్నత స్థాయిలో తక్షణ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మణిపూర్ లో శాంతిభద్రతల పరిస్థితిపై అత్యున్నత స్థాయిలో తక్షణ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్ అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ (రిటైర్డ్) చేసిన ట్వీట్పై జనరల్ మాలిక్ (రిటైర్డ్) స్పందించారు. ‘‘మణిపూర్ కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నుండి అసాధారణమైన విచారకరమైన పిలుపు వచ్చింది. మణిపూర్ లో శాంతిభద్రతల పరిస్థితిపై అత్యున్నత స్థాయిలో తక్షణ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన రీట్వీట్ చేస్తూ పేర్కొన్నారు.

ఒడిశా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ ను కాల్చి చంపిన వేటగాళ్లు..

1997 సెప్టెంబర్ 30 నుంచి 2000 సెప్టెంబర్ 30 వరకు 19వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పనిచేసిన జనరల్ మాలిక్ తన ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాలను ఈ ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

అంతకు ముందు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ (రిటైర్డ్) ట్వీట్ చేస్తూ ‘‘నేను మణిపూర్ కు చెందిన సాధారణ భారతీయుడిని. రాష్ట్రం ఇప్పుడు 'రాజ్యం లేనిది' అయ్యింది. లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా వంటి దేశాల్లో మాదిరిగా ఎవరైనా ఎప్పుడైనా ప్రాణాలను, ఆస్తులను ధ్వంసం చేయవచ్చు. మణిపూర్ ను ఉడకబెట్టినట్లు తెలుస్తోంది. ఎవరైనా వింటున్నారా?’’ అని పేర్కొన్నారు.

పాపం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై బాలిక తప్పుడు ఫిర్యాదు, చితకబాదిన స్థానికులు.. సీసీ టీవీ ఫుటేజీలో నిజం వెలుగులోకి

లెఫ్టినెంట్ జనరల్ సింగ్ (రిటైర్డ్) ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని మోడీకి కష్టాల్లో ఉన్న మణిపూర్ ప్రజలను ఆలోచనల్లో, మాటలో, చేతల్లో చేరవేయడం మినహా మిగతా అన్ని విషయాలకు ఆయనకు సమయం ఉంది.’’ అని విమర్శించారు. 

ఇలా చేస్తే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయి - బీజేపీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్

ఇప్పటివరకు 120 మందికి పైగా మరణించి, 400 మందికి పైగా గాయపడిన వినాశకరమైన జాతి హింస మే 3 న మణిపూర్లో మెయిటీ కమ్యూనిటీ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా డిమాండ్ కు నిరసనగా రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో గిరిజన విద్యార్థి సంఘం నిర్వహించిన 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' తరువాత ప్రారంభమైంది.

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu