కర్ణాటక హోంమంత్రికి సిగ్గుంటే మురుగ మఠాధిపతిపై చ‌ర్య‌లు తీసుకోవాలి - బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వ‌నాథ్

By team teluguFirst Published Aug 31, 2022, 1:15 PM IST
Highlights

మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన మురుఘా మఠానికి చెందిన లింగాయత్‌ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్‌ అన్నారు. అతడిపై ఎందుకు చర్యలు తీసుకవోడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు శ్రీ మురుఘా మఠ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుపై కర్ణాటక ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు మండిపడ్డారు. ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్ ను విమ‌ర్శిస్తూ.. ‘‘ ఆయనకు సిగ్గు ఉంటే ఆ పీఠాధిపతిపై చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనపై చర్యలు తీసుకోని చిత్రదుర్గ ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలి.’’ అని అన్నారు. 

లెక్క‌ల మాస్టార్ ను చెట్టుకు క‌ట్టేసి కొట్టిన విద్యార్థులు.. అస‌లేం జ‌రిగిందంటే..?

మైనర్ బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని వివరాలతో కూడిన లేఖ రాస్తానని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై సొంత పార్టీ నాయకుడే విరుచుకుపడుతూ.. ‘‘ ఈ విషయంపై ఎవరూ నోరు విప్పడం లేదు. ప్రతిదీ రాజకీయంగా చూస్తున్నారు. దానిపై మాట్లాడితే ఓట్లు పోతాయని పార్టీలు భయపడుతున్నాయి. అంతా ఓటు బ్యాంకు రాజకీయాలే ’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఓట్ల కోసం మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్నారని హెచ్.విశ్వనాథ్ ప్రశ్నించారు.

చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారుపై మైనర్ బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం బాలికలపై నిందితుడు రెండేళ్లకు పైగా వేధింపులకు పాల్ప‌డ్డాడు.

If HM Araga Jnanendra has any shame, he should initiate action against the seer. Chitradurga SP should be suspended immediately for not initiating action: Karnataka BJP MLC H Vishwanath on sexual assault allegations against Shivamurthy Murugha Sharanaru of Sri Murugha Mutt (30.8) pic.twitter.com/c5YO9fDGZL

— ANI (@ANI)

కేసులో బాధితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, సీఆర్ పీసీ సెక్షన్ 164 ప్రకారం వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని భావిస్తున్నారు. బాధితులు ఇప్పటికే పోలీసుల ఎదుట వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు నమోదైన మైసూరు నుంచి కేసును చిత్రదుర్గకు బదిలీ చేశారు. బాలికల తరపున చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఫిర్యాదు చేసింది. మైసూరుకు చెందిన ఓడనాడి అనే NGO ప్రాణాలతో రక్షించాలని, శక్తివంతమైన సీర్‌పై చట్టపరమైన చర్యలు కోరుతూ CWCని ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంలోని నివాస సదుపాయంలో బస చేసిన బాధిత విద్యార్థులను ఏదో ఒక సాకుతో పీఠాధిపతి గదికి పంపేవారు. అక్కడ బాలికలకు మత్తు పదార్థాలు కలిపిన ఆహారం లేదా పానీయాలు ఇచ్చి వారిని లైంగికంగా దోచుకునేవాడు. 

ఆజాద్‌కు దెబ్బ‌కు.. జ‌మ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌కు కష్టాలు.. మ‌రో 42 మంది నేతల రాజీనామా!

కాగా.. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రదుర్గలోని మురుగ మఠాన్ని పార్టీ నాయకులు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్తో కలిసి సందర్శించారు. మురుగ మఠాన్ని అనేక మంది రాజ‌కీయ నాయకుల సంద‌ర్శిస్తుంటారు. అయితే పీఠాధిపతి రాహుల్ గాంధీకి ‘లింగదీక్షే’ కూడా ఇచ్చారు. ఇది లింగాయత్ శాఖలోకి ఒక వ్యక్తిని ఆహ్వానించే అధికారిక వేడుకగా భావిస్తారు. 
 

click me!