మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 9:30 PM IST
Highlights

సొంతగడ్డపై అడుగుపెట్టిన అభినవ్ కు భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర ఇరుదేశాల ఆర్మీ అధికారుల ఫార్మాలిటీస్ అనంతరం వాయుపుత్రుడు భారత్ లో అడుగుపెట్టారు. 

వాఘా: పాకిస్థాన్ ఆర్మీలో చిక్కిన వాయుపుత్రుడు అభినందన్ ఎట్టకేలకు మాతృభూమిపై అడుగుపెట్టారు. రాత్రి 9గంటల అనంతరం అభినందన్ ఇరుదేశాల డాక్యుమెంటనేషన్ పూర్తి చేసుకున్న అనంతరం వాఘా బోర్డర్ గుండా మాతృభూమిపై అడుగుపెట్టారు. 

సొంతగడ్డపై అడుగుపెట్టిన అభినవ్ కు భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర ఇరుదేశాల ఆర్మీ అధికారుల ఫార్మాలిటీస్ అనంతరం వాయుపుత్రుడు భారత్ లో అడుగుపెట్టారు. 

వింగ్ కమాండర్ అభినందన్ కు ఆర్మీ సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు. అయితే వింగ్ కమాండర్ అభినందన్ ను ఉదయం పాక్ అధికారులు భారత్ దౌత్య సిబ్బందికి అప్పగించారు. వారి సమక్షంలో లాహోర్ లో విచారణ జరిపారని తెలుుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అభినందన్ విడుదలపై వీడని ఉత్కంఠ: అప్పగించలేదంటున్న పాకిస్థాన్

వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగింత

click me!