Hate speech: అత్యంత విద్వేషపూరిత ప్రసంగాల వెనుక బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు.. షాకింగ్ రిపోర్టు

Published : Sep 26, 2023, 10:47 AM IST
Hate speech: అత్యంత విద్వేషపూరిత ప్రసంగాల వెనుక బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు.. షాకింగ్ రిపోర్టు

సారాంశం

New Delhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ భారతదేశంలో అత్యంత ద్వేషపూరిత ప్రసంగాలతో ముడిపడి ఉందని నివేదిక పేర్కొంది. అనేక ర్యాలీల్లో ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు ఉన్నాయని హిందూత్వ వాచ్ రిపోర్టు పేర్కొందని బ్లూమ్‌బెర్గ్ క‌థ‌నం పేర్కొంది. ఇలాంటి చాలా ఘటనలు బీజేపీ పాలిన రాష్ట్రాల్లోనే జరిగాయని తెలిపింది.  

Modi's BJP Linked With Most Hate Speech in India: ఈ ఏడాది ప్రథమార్థంలో ముస్లింలపై జరిగిన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక ప్రధాని నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని అధికార పార్టీ, అనుబంధ గ్రూపుల హస్తం ఉందని సోమవారం విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్, డీసీల క‌థ‌నాల‌ ప్ర‌కారం.. హిందుత్వ వాచ్ నివేదిక, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నమోదైన 225 విద్వేష ప్రసంగ సమావేశాల సంఘటనలలో 80% భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన ఈ రీసెర్చ్ గ్రూప్ భారత్ లోని ముస్లింలు, ఇతర మైనారిటీలపై విద్వేషపూరిత నేరాలు, రెచ్చగొట్టే ప్రసంగాలను ట్రాక్ చేస్తుంది.

2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ లో ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు పెరుగుతున్నాయని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన ఘటనల్లో సగానికి పైగా అధికార బీజేపీ, అనుబంధ సంస్థలైన భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, సకల్ హిందూ సమాజ్ ల ద్వారానే జరిగాయని నివేదిక పేర్కొంది. ఆ గ్రూపులకు బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా ఆరెస్సెస్ తో సంబంధాలు ఉన్నాయ‌ని సంబంధిత క‌థ‌నాలు పేర్కొన్నాయి. న్యూఢిల్లీలోని బీజేపీ సీనియర్ సభ్యుడు అభయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వార్త పూర్తిగా నిరాధారమని అన్నారు. మతాల ఆధారంగా దేశాన్ని, ప్రజలను తాము విభజించబోమని చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలకు బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు.

భారత క్రైమ్ బ్యూరో 2017లో విద్వేష నేరాలకు సంబంధించిన డేటాను సేకరించడం నిలిపివేసిన తర్వాత ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలను డాక్యుమెంట్ చేయడం ఇదే తొలిసారి. హిందుత్వ వాచ్ డేటా సేకరణలో సోషల్ మీడియా, వార్తా సంస్థలపై ఆధారపడింది. విద్వేషపూరిత ప్రసంగ సంఘటనల ధృవీకరించదగిన వీడియోలను గుర్తించడానికి డేటా స్క్రాపింగ్ పద్ధతులను ఉపయోగించింది. తరువాత పాత్రికేయులు, పరిశోధకుల ద్వారా సంఘటనలపై లోతైన దర్యాప్తును నిర్వహించింది. విద్వేష ప్రసంగానికి భారతదేశానికి అధికారిక నిర్వచనం లేనప్పటికీ, పరిశోధనా బృందం ఐక్యరాజ్యసమితి నుండి భాషను ఉపయోగించింది. ఇది విద్వేష ప్రసంగాన్ని మతం, జాతి, జాతీయత వంటి లక్షణాల ఆధారంగా ఒక వ్యక్తిగత సమూహం పట్ల పక్షపాత లేదా వివక్షాపూరిత భాషను ఉపయోగించే కమ్యూనికేషన్ లోని ఏదైనా రూపంగా వర్గీకరించింది.

మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లలో విద్వేషపూరిత ప్రసంగాలతో ఎక్కువ మంది గుమిగూడినట్లు నివేదిక కనుగొంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లోనే మూడింట ఒక వంతు ఘటనలు చోటుచేసుకున్నాయి. 15 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించిన హిందుత్వ వాచ్, 64 శాతం సంఘటనలు ముస్లిం వ్యతిరేక కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేశాయపీ, ముస్లింలు హిందూ మహిళలను ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తున్నారనే వాదన కూడా ఉందని నివేదించింది.

33 శాతం ఘటనల్లో ముస్లింలపై హింసను ప్రేరేపించారని, 11 శాతం మంది హిందువులకు ముస్లింలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారని నివేదిక తెలిపింది. మిగిలిన సమావేశాల్లో ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, సెక్సిస్ట్ ప్రసంగాలు జరిగాయని నివేదిక తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవడానికి బదులుగా, ప్రభుత్వ అధికారులు తరచుగా దానిలో నిమగ్నమయ్యారని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిలో కొందరు అధికార బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులు ఉన్నారు.

(బ్లూమ్‌బెర్గ్, డీసీల సౌజ‌న్యంతో..) 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway