
కొత్త క్రిమినల్ చట్టాలను పార్లమెంటు ఆమోదించిన తర్వాత క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో అమిత్ షా శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు క్రిమినల్ కోడ్లు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునరుద్ధరిస్తాయని, వ్యవస్థ భవిష్యత్తు డిమాండ్లను తీర్చడానికి సాంకేతిక ఆధారిత పోలీసింగ్ ను ప్రవేశపెట్టడానికి కొత్త చొరవలను సూచిస్తాయని మంత్రి చెప్పారు.
రెండు రోజుల పాటు కొనసాగిన ఈ సదస్సు శనివారం ముగిసింది. దేశవ్యాప్తంగా 750 మందికి పైగా పోలీసు అధికారులు భౌతిక, వర్చువల్ పద్ధతుల్లో ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై.. పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. పౌరులకు సకాలంలో న్యాయం అందించాల్సిన అవసరాన్ని, వారికి రాజ్యాంగపరమైన హక్కులకు హామీ ఇచ్చే వ్యవస్థను నిర్ధారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశ అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు నాయకత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు.
చంద్రయాన్-3 : జాబిల్లిపై 8 మీటర్లు కదిలిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇంకా ఏం చేసిందంటే ?
పోలీసింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నొక్కిచెప్పిన అమిత్ షా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సాంకేతిక పురోగతిని ప్రస్తావించారు. ఏఐ ను ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ఇతర దేశాలకు చెందిన వారు భారత్ నుంచి నేర్చుకునేలా ఆదర్శంగా నిలవాలని కోరారు.
ముస్లిం క్లాస్ మేట్ ను చెంపదెబ్బ కొట్టాలని విద్యార్థులకు సూచించిన టీచర్.. యూపీలో ఘటన.. వీడియో వైరల్
కాగా.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లు, 2023, భారతీయ నగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) బిల్లు 2023, భారతీయ సక్ష (బీఎస్) బిల్లు 2023 వరుసగా భారతీయ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ చట్టం, 1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో మూడు కొత్త కోడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను పరిశీలన కోసం హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు.