ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ అసద్ అహ్మద్ హతం.. యూపీ సీఎం యోగికి థ్యాంక్స్ చెప్పిన ఉమేష్ పాల్ భార్య..

Published : Apr 13, 2023, 04:07 PM IST
ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ అసద్ అహ్మద్ హతం.. యూపీ సీఎం యోగికి థ్యాంక్స్ చెప్పిన ఉమేష్ పాల్ భార్య..

సారాంశం

గ్యాంగ్ స్టర్ అసద్ అహ్మద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చడం పట్ల ఉమేష్ పాల్ భార్య సంతోషం వ్యక్తం చేశారు. తనకు తక్షణ న్యాయం చేశారంటూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఉమేష్ పాల్ తల్లి కూడా సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న అసద్ అహ్మద్ యూపీ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో గురువారం హతమయ్యాడు. దీంతో ఉమేష్ పాల్ భార్య జయపాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు తక్షణ న్యాయం అందించినందుకు ధన్యవాదాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఉమేష్ పాల్ తల్లి కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘న్యాయం చేసినందుకు సీఎం యోగికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. సీఎంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని ప్రయాగ్ రాజ్ లోని ఉమేష్ పాల్ తల్లి శాంతిదేవి అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీని వీడిన మరో ఎమ్మెల్యే కుమారస్వామి

ఈ ఎన్ కౌంటర్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీ ఎస్టీఎఫ్‌పై ప్రశంసలు కురిపించారు. హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ ఈ ఎన్‌కౌంటర్ విషయాన్ని సీఎంకు సమాచారం అందించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ తర్వాత శాంతిభద్రతలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం ముందు నివేదిక ఉంచారు. ఉమేష్ పాల్ హత్య కేసు తరువాత అసద్ అహ్మద్ పరారీలో ఉన్నారు.

హనుమాన్ జయంతి ర్యాలీలో హింసాకాండ.. మత ఘర్షణలో 10 మంది పోలీసులకు గాయాలు.. వాహనాలకు నిప్పు

2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య జరిగింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లోని ధూమన్ గంజ్ ప్రాంతంలోని ఆయన నివాసం వెలుపల పలువురు కాల్చి చంపారు. ఉమేష్ పాల్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న అతిక్ అహ్మద్, అష్రఫ్, వారి కుటుంబ సభ్యులు, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 147 (అల్లర్లు), 148 (మారణాయుధాలతో అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూషన్ చేయడంలో చేసిన నేరానికి చట్టవిరుద్ధంగా గుమిగూడడం), 302 (హత్య), 307 (హత్యాయత్నం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తనకు ప్రాణహాని ఉందని, ఉత్తరప్రదేశ్ పోలీసులు తనను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేస్తారని అతిక్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు.ఉమేష్ పాల్ కేసులో తనను, తన కుటుంబాన్ని నిందితులుగా తప్పుడు కేసులో ఇరికించారని, తనను చంపేస్తారని గత నెలలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయంలో రక్షణ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu