G20 summit: ప్రధాన రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై ప్రధాని మోడీ, యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ సమీక్ష

Published : Nov 15, 2022, 04:47 PM IST
G20 summit: ప్రధాన రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై ప్రధాని మోడీ, యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ సమీక్ష

సారాంశం

G20 summit in Bali: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉక్రెయిన్-రష్యా వార్ గురించి మాట్లాడారు. యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో శాంతిని తిరిగి తీసుకురావడానికి ప్రపంచం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుందని అన్నారు. అలాగే, భారతదేశ ఇంధన అవసరాల గురించి కూడా మాట్లాడారు.

Modi, Joe Biden hold talks on bilateral ties: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. మంగళవారం బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల నేతలు పలు అంశాలను గురించి చర్చించినట్టు సమాచారం. 

వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉక్రెయిన్ - రష్యా వార్ గురించి మాట్లాడారు. యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో శాంతిని తిరిగి తీసుకురావడానికి ప్రపంచం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుందని అన్నారు. అలాగే, భారతదేశ ఇంధన అవసరాల గురించి కూడా మాట్లాడారు. ఇదే క్రమంలో అమెరికా భారత్ సంబంధాల గురించి ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్), ఐ2యూ2 (భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ) వంటి గ్రూపుల్లో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం, సన్నిహిత సహకారాన్ని కొనసాగించడాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

 

కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి భవిష్యత్తు ఆధారిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై మోడీ, బైడెన్ సమీక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు సమయోచిత ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. భారతదేశం-యూఎస్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బైడెన్ కు నిరంతర మద్దతు ఇచ్చినందుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. 2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో రెండు దేశాలు సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో మోడీ, బైడెన్ భేటీ అయ్యారు.

 

"ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతలు, అభివృద్ధి ఎజెండాను రూపొందించడానికి నాయకులతో కలిసి పనిచేయడం. #G20India దృష్టి కేంద్రీకరించిన అంశాలను వివరిస్తూ.. మా జీ20 అధ్యక్ష పదవికి మద్దతును ప్రధాని స్వాగతించారు" అని బాగ్చి ట్వీట్ చేశారు. కాగా, బాలిలో జరిగే శిఖరాగ్ర సమావేశం ముగింపులో జీ20 అధ్యక్షుడిగా ఇండోనేషియా నుండి భారతదేశం బాధ్యతలు స్వీకరించనుంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన భద్రత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 అధ్యక్ష పదవి దృష్టి సారిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్