మనీ లాండరింగ్​ కేసులో జాక్వెలిన్​ కు ఊరట.. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు.. 

Published : Nov 15, 2022, 04:34 PM IST
మనీ లాండరింగ్​ కేసులో జాక్వెలిన్​ కు ఊరట.. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు.. 

సారాంశం

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ఆమె  మంగళవారం నాడు పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్: 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. పటియాలా హౌస్ కోర్టు మంగళవారం నటికి రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అలాగే పలు షరతులను విధించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. మహాతుగ్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు బయటకు రావడంతో ఇబ్బంది పడింది. నవంబర్ 10న జాక్వెలిన్ బెయిల్‌పై కోర్టులో వాదించిన తర్వాత నిర్ణయం రిజర్వ్ చేయబడింది. 

సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఆమెకు చాలా ఖరీదైన బహుమతులు అందించినట్టు, అలాగే సుఖేష్ లో జాక్వెలిన్ చాలా సహ్నితంగా ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలో ఆమెను కూడా నిందితురాలిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. మోసగించిన డబ్బుకు ఆమె లబ్ధిదారులుగా పేర్కొంది. ఈ కేసులో జాక్వెలిన్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసింది, దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యతిరేకించింది, ఇది దర్యాప్తు నుండి తప్పించుకోవడానికి జాక్వెలిన్ దేశం విడిచి పారిపోయి ఉండవచ్చునని ఆరోపించింది.

బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ

జాక్వెలిన్ సరదాగా రూ.7.14 కోట్లు ఖర్చు చేసిందని జాక్వెలిన్ బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. కావాల్సినంత డబ్బు ఉండడంతో పారిపోయేందుకు ప్రయత్నం చేయవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు సమయంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను అరెస్టు చేయకూడదని నిర్ణయించిన కేంద్ర ఏజెన్సీని కోర్టు ప్రశ్నించింది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu