సర్పంచ్‌ పోస్టుకు పోటీ చేసే అభ్యర్థి పంచిన కల్తీ మందు తాగి ఐదుగురు మరణం

Published : Sep 11, 2022, 04:30 AM IST
సర్పంచ్‌ పోస్టుకు పోటీ చేసే అభ్యర్థి పంచిన కల్తీ మందు తాగి ఐదుగురు మరణం

సారాంశం

హర్యానాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ ఓ అభ్యర్థి కల్తీ మద్యం పంచి పెట్టాడు. ఈ కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

న్యూఢిల్లీ: హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మందు తాగి హరిద్వార్‌లోని రెండు గ్రామాలకు చెందిన ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఏర్పడింది.

ఈ ఘటన తర్వాత ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి చాంద్ సేమ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు విధించారు. ఇందులో హరిద్వార్ జిల్లా పోలీసు అధికారి కూడా ఉన్నారు. 

అదనపు ఎక్సైజ్ కమిషనర్ రిపోర్టు మీడియా రిపోర్టును ధ్రువీకరిస్తూ.. ఆ ఐదుగురి మురణానికి ప్రధాన కారణంగా ఆ కల్తీ కల్లు తాగడమే అని స్పష్టం చేసింది. సదరు లిక్కర్‌ను ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలపై అభ్యర్థి పంచిపెట్టినట్టు ఓ రిపోర్టు తెలిపింది.

డీజీపీ అశోక్ కుమార్ ఈ ఘటనపై మాట్లాడారు. ఫూల్ గడ్ పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ ఓ అభ్యర్థి పంచిన కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు. అయితే, పోస్టుమార్టం తర్వాతే అసలైన కారణం బయట పడుతుందని తెలిపారు.

కాగా, సీఎం పుష్కర్ సింగ్ దామి కూడా ఈ ఘటనపై మాట్లాడారు. ఈ ఘటన పరిణామాలను ఆయన గుర్తించారు. ఈ ఘటనలో దోషులుగా గుర్తించిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటు వెళ్లుతుందని అన్నారు. పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కల్తీ మద్యం ఏరులైపారుతున్నదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌