
అహ్మదాబాద్: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ పంజా విసురుతూనే ఉన్నది. గుజరాత్లోనూ ఈ వైరస్తో తొలి మరణం రిపోర్ట్ అయింది. దీంతో దేశంలో మొత్తం హెచ్3ఎన్2 వైరస్ మరణాల సంఖ్య ఏడుకు చేరింది.
హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ బారిన పడిన ఓ మహిళ వడోదరలోని ఎస్ఎస్జీ హాస్పిటల్లో చేరారు. అదే హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి మరణించింది.
మన దేశంలో హెచ్3ఎన్2 వైరస్ ద్వారా తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్తో మరణించారు. ఇదిలా ఉండగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు మన దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ నెలాఖరులో కేసుల సంఖ్య తగ్గిపోతాయని అంచనా వేసింది.
Also Read: మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి మరణ శిక్ష.. ‘అరుదుల్లోకెల్లా అరుదైన కేసు’
ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవద్దని ఐసీఎంఆర్ ఈ సందర్భంగా సూచించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది సాధారణంగా పందుల్లో వ్యాప్తి చెందుతుందని వివరించింది.