పెళ్లి విందులో రసగుల్లాలు సరిపోలేవని ఘర్షణలు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

Published : Oct 27, 2022, 08:18 PM IST
పెళ్లి విందులో రసగుల్లాలు సరిపోలేవని ఘర్షణలు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

సారాంశం

ఆగ్రాలో ఓ వివాహ విందులో రసగుల్లాలు తక్కువయ్యాయని గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.  

న్యూఢల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఎట్మద్‌పూర్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా విందు జరిగింది. ఈ విందులో వరుడు, వధువు వైపు బంధువులు విందు ఆరగించారు. అయితే, ఆ విందులో రసగుల్లాలు సరిపోలేవు. రసగుల్లాలు తగ్గిపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. చివరకు ఒకరి పై ఒకరు చేయి చేసుకున్నారు. అందులో ఒకరు కత్తి తీసి ఎదుటి వర్గం వారి పై దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఒకరు కత్తిపోటుకు గురై మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు.

మొహల్లా షైఖాన్ నివాసి ఉస్మాన్ కూతురికి పెళ్లి చేశారు. ఎట్మాద్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లిలో భాగంగా విందు నిర్వహించారు. ఈ విందులో రసగుల్లాలు షార్టేజ్ అయ్యాయి. దీంతో వరుడు, వధువు వైపు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Also Read: వైరల్ వీడియో: మిస్ శ్రీలంక పోటీల్లో ఘర్షణ, ఒకరినొకరు కొట్టుకున్నారు..!

ఎట్మద్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ రవి కుమార్ గుప్తా ప్రకారం రసగుల్లాల షార్టేజీ కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి విందుకు హాజరైన వారిపై కత్తితో దాడి చేశాడు. ఇందులో 22 ఏళ్ల సన్ని తీవ్రంగా గాయపడ్డాడు. ఈయనను తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత ఆగ్రాలోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడే ట్రీట్‌మెంట్ జరుగుతుండగా మరణించాడు. ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారని గుప్తా తెలిపారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన ఐదుగురిని ఎట్మద్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపించినట్టు పోలీసులు తెలిపారు.

బాధితుడి కుటుంబం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గుప్తా వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu