బాలుడి గొంతులో మేకు.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు

Published : Apr 13, 2019, 08:06 AM IST
బాలుడి గొంతులో మేకు.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు

సారాంశం

నాలుగేళ్ల బాలుడి గొంతులో మేకు ఇరుక్కుపోగా.. శస్త్రచికిత్స చేసి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సూరత్ లో చోటుచేసుకుంది. 


నాలుగేళ్ల బాలుడి గొంతులో మేకు ఇరుక్కుపోగా.. శస్త్రచికిత్స చేసి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సూరత్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రకు చెందిన దంపతులకు ప్రథమేష్(4) అనే కుమారుడు ఉన్నాడు. బాలుడి గొంతులో ప్రమాదశాత్తు మేకు ఇరుక్కుంది. కాగా దానిని వెలికి తీసేందుకు అక్కడి వైద్యులు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పారు. అంత చెల్లించే స్థోమత లేక బాలుని తల్లిదండ్రులు బంధువు సూచనల మేరకు కుమారుడిని సూరత్ తీసుకువచ్చాడు. 

అక్కడి సివిల్ ఆసుపత్రి వైద్యులకు కుమారుడిని చూపించాడు. వారు మరోమారు ఎక్స్‌రే తీసి, ప్రత్యేక టెలిస్కోపీ విధానంలో ఆ మేకును 3 నిముషాల వ్యవధిలో వెలికి తీశారు. ఇందుకు కేస్ పేపర్‌కు రూ. 10, ఎక్స్‌రే కోసం రూ. 50 ఖర్చయ్యాయి. బాలుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడటంతో.. బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు దన్యవాదాలు తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

వివాహేతర సంబంధం ఉంటే అరెస్ట్ చేస్తారా.? విజ‌య్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంది? చ‌ట్టం ఏం చెబుతోందంటే
తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు