మాజీ ప్రేమికుడి అరాచకత్వం.. వివాహమైన యువతిని హత్య చేసి, మృతదేహాన్ని 8 ముక్కలుగా నరికి.. తల వేరు చేసి..

By team teluguFirst Published Nov 21, 2022, 8:57 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ యువతిని మాజీ ప్రేమికుడు ఘోరంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని బావిలో విసిరాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఢిల్లీలో సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్ లోనూ తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని అప్తాబ్ అనే యువకుడు హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా చేసిన మాదిరిగానే యూపీలో  అజంగఢ్‌లో ఓ మాజీ ప్రేమికుడు ఓ యువతిని చంపేసి ఎనిమిది ముక్కలు చేశాడు. ఈ దారుణం కొంత ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వివరాలను వెల్లడించారు.

బీహార్ లో ట్రక్కు బీభత్సం, చిన్నారులతో సహా.. 12మంది మృతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ..

అజంగఢ్ ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వారం ప్రారంభంలో బావిలో ఓ బావిలో తల నరికి ఉన్న మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న యాదవ్ విదేశాలలో ఉంటున్నాడు. అజంగఢ్‌లో ఉంటున్న అతడి మాజీ ప్రేయసి ఆరాధనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న యాదవ్ తిరిగి ఇండియాకు వచ్చాడు. ఆమెను కలుసుకున్నాడు. 

Deceased got married in Feb this year when the accused was living abroad. On his return, he tried to persuade her to break her marriage. When she didn't agree, he took her out on Nov 10 on pretext of visiting temple & later took her to a field & strangled her to death:Azamgarh SP pic.twitter.com/xsa6wsNtAb

— ANI UP/Uttarakhand (@ANINewsUP)

భర్త నుంచి విడిపోవాలని, తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. వారి వివాహాన్ని విచ్చిన్నం చేసేందుకు అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దానికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో నవంబర్ 10వ తేదీన ఆలయాలనికి వెళ్లి వద్దాం అని చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఓ పొలంలోకి తీసుకెళ్లి ఆ యువతి గొంతును నులిమి చంపేశాడు. 

బెంగాల్ లో ఢిల్లీ తరహా ఘటన.. తండ్రిని హత్య చేసి.. తల్లి సాయంతో ముక్కలుగా నరికి.. దారుణం...

తరువాత ఆ మృతదేహాన్నిఎనిమిది ముక్కలుగా కోసి బావిలో పడేశాడు. ఆమె బట్టలను కూడా తొలగించి అందులోనే విసిరాడు. అయితే తలను తీసుకొని సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నవంబర్ 15న అజంగఢ్‌లోని పశ్చిమి గ్రామం వెలుపల ఉన్న బావిలో కొంతమంది స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ మృతదేహం పాక్షిక నగ్న స్థితిలో లభించింది. అప్పటికే ఆమె చనిపోయి రెండు, మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

గుజరాత్‌లో కేజ్రీవాల్ రోడ్‌షోలో మోడీ-మోడీ అంటూ నినాదాలు.. ఆప్ చీఫ్ ఎమ‌న్నారంటే..?

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి యాదవ్ శనివారం అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు సమయంలో నిందితుడు ఓ కంట్రీ మేడ్ పిస్టల్ తో బెదిరించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మృతురాలు ఆరాధనతో తనకు గతంలో సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. ఇందులో మరో 8 మందికి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!