అనుమానం.. మిట్ట మధ్యాహ్నం  భార్యపై ఘాతుకం..  

Published : Aug 18, 2023, 04:07 PM IST
అనుమానం.. మిట్ట మధ్యాహ్నం  భార్యపై ఘాతుకం..  

సారాంశం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన 32 ఏళ్ల భార్యను అనుమానించి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ హంతకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన 32 ఏళ్ల భార్యను గొంతు కోసి హత్య చేశాడు. పాల్ఘర్‌లోని వాడా తాలూకా నుండి నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జంట పాల్ఘర్‌లోని ధన్వేపాడలో నివసించారు. నిందితుడు వ్యక్తి తన భార్య ప్రవర్తన అనుమానం పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య తరుచు తగాదాలు తలెత్తాయేవి.  ఈ క్రమంలో  గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ క్రమంలో సహనం కోల్పోయిన భర్త ఆమె గొంతు కోసి చంపాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న బృందం మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె హత్య కేసులో భర్త అశోక్ మరాడేను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

India-Japan Investments : భారత్‌లో జపాన్ పెట్టుబడులు.. వందలు వేలు కాదు ఏకంగా రూ.5 లక్షల కోట్లా..!
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !