అంతా బాగానే ఉంద‌ని అనిపిస్తే నాకు ఓటు వేయొద్దు - కాంగ్రెస్ అధ్య‌క్ష అభ్య‌ర్థి శశి థరూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Published : Oct 13, 2022, 03:25 PM IST
అంతా బాగానే ఉంద‌ని అనిపిస్తే నాకు ఓటు వేయొద్దు - కాంగ్రెస్ అధ్య‌క్ష అభ్య‌ర్థి శశి థరూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

సారాంశం

కాంగ్రెస్ లో చాలా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నానని, ప్రస్తుతం అంతా బాగానే ఉందని అనిపిస్తే తనకు ఓటు వేయొద్దని ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఎంపీ శశిథరూర్ అన్నారు. మల్లికార్జున్ ఖర్గేతో తనకు శత్రుత్వం లేదని చెప్పారు. 

తాను కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే 2014, 2019లో పార్టీతో ఉండ‌ని ఓట‌ర్లను తిరిగి తీసుకువ‌స్తాన‌ని ఆ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు శ‌శి థ‌రూర్ అన్నారు. గురువారం ఆయ‌న ఢిల్లీలో మీడియా స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..త‌మ పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని అన్నారు. ఎందుకంటే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పార్టీ అధ్యక్ష ప‌దవికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని చెప్పారు.

పెళ్లి అంటే ఏమిటీ? ఓ స్టూడెంట్ ఆన్సర్ చదివి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు

‘‘ పార్టీ మార్పుతో ముందుకు సాగాలని మీరు కోరుకుంటున్నారా లేక ఇప్పుడు అంతా బాగానే ఉంద‌ని సంతృప్తిగా ఉన్నారా ? అంతా బాగానే ఉంద‌ని మీకు అనిపిస్తే.. 2014, 2019 సంవ‌త్స‌రంలో మ‌న పార్టీతో ఉండ‌ని ఓట‌ర్ల‌ను తిరిగి తీసుకురావాల‌ని కోరుకుంటున్నా. అలాంటి మార్పు కోసం ప‌ని చేయాల‌ని అనుకుంటున్నా.. కాబ‌ట్టి నాకు ఓటు వేయొద్దు. మల్లికార్జున్ ఖర్గేతో నాకు శత్రుత్వం లేదు. ఇద్దరం కాంగ్రెస్ నాయకులుగా పోటీ చేస్తున్నాం. 

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని, ఎన్నిక‌ల ఫ‌లితాలు 19వ తేదీన వెలువ‌డ‌నున్నాయ‌ని శ‌శి థ‌రూర్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులను ఎన్నుకోవడానికి కూడా ఎన్నికలు జరగాలని ఆయ‌న చెప్పారు. దీని వ‌ల్ల పీసీసీ ప్రతినిధులకు కూడా ప్రాముఖ్యత లభిస్తుంద‌ని చెప్పారు. అలాగే త‌మ పార్టీలో ఆఫీస్ బేరర్ల నియామకాల్లో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేపై థరూర్ పోటీ చేస్తున్నారు.

షూలో దూరిన పాము... వైరల్ అవుతున్న వీడియో..!

ఇదిలా ఉండ‌గా.. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కూడా ఇటీవ‌ల ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే పార్టీలో మార్పులు తీసుకొస్తాన‌ని అన్నారు. ఎవ‌రి చేతిలోనూ రిమోట్ గా మార‌బోన‌ని అన్నారు. త‌మ క‌మిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్ కమిటీ, ప్రైమరీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటాయ‌ని పేర్కొన్నారు. నేను రిమోట్ కంట్రోల్ అని, వెనుక నుండి పనిచేస్తానని చాలా మంది చెబుతున్నార‌ని, కానీ కాంగ్రెస్ లో అలాంటిదేమీ లేద‌ని అన్నారు. 

జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు.. చీటింగ్ కేసు కూడా న‌మోదు చేసిన ఈడీ

సంస్థాగత పోస్టుల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఖర్గే హామీ ఇచ్చారు. తాను పార్టీ అధ్యక్షుడైతే పార్టీలోని ప్రతి స్థాయిలో మహిళలు, యువత, దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర యూనిట్లకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. నా పార్టీ సిద్ధాంతాలను, గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను కాపాడేందుకు, సర్దార్ పటేల్ ఇచ్చిన ఐక్యత పిలుపును బలోపేతం చేసేందుకు తాను ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాన‌ని అన్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్