ప్రధాని మోదీ ‘‘మన్ కీ బాత్’’ ప్రభావంపై ప్రత్యేక డాక్యుమెంటరీ.. జూన్ 2న ప్రీమియర్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

Published : Jun 01, 2023, 10:28 AM IST
ప్రధాని మోదీ ‘‘మన్ కీ బాత్’’ ప్రభావంపై ప్రత్యేక డాక్యుమెంటరీ.. జూన్ 2న ప్రీమియర్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంత విశేష ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రభావంపై ‘‘మన్ కీ బాత్: భారత్ కీ బాత్’’ పేరుతో హిస్టరీ టీవీ 18లో ప్రత్యేక డాక్యూమెంటరీని ప్రదర్శించనున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంత విశేష ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా దేశానికి సంబంధించిన ఇతివృత్తాలు, సమస్యలపై భారతదేశ పౌరులతో మోదీ సంభాషిస్తున్నారు. ఈ ఐకానిక్ కార్యక్రమం గత నెల 30వ తేదీన 100వ ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రభావంపై ‘‘మన్ కీ బాత్: భారత్ కీ బాత్’’ పేరుతో హిస్టరీ టీవీ 18లో ప్రత్యేక డాక్యూమెంటరీని ప్రదర్శించనున్నారు. 

ఇందుక సంబంధించిన ప్రోమోను తాజాగా హిస్టరీ టీవీ 18 విడుదల చేసింది. శుక్రవారం (జూన్ 2) రాత్రి 8 గంటలకు ‘‘మన్ కీ బాత్: భారత్ కీ బాత్’’ అనే ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టుగా పేర్కొంది. ఈ డాక్యుమెంటరీలో.. 2014లో ప్రధాని మోదీ ‘‘మన్ కీ బాత్’’ రేడియో కార్యక్రమం ఎలా రూపుదిద్దుకుంది, ఈ వాస్తవమైన మరియు సరళమైన ఆలోచన ఎందుకు దేశంలోని అన్ని మూలలను ఒక సంభాషణ ద్వారా కనెక్ట్ చేయగలిగింది, అది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా మార్పును ప్రేరేపించిందనే విషయాలను ప్రదర్శించనున్నారు. 

 


మన్‌ కీ బాత్ కార్యక్రమం ఏప్రిల్ 30వ తేదీన 100వ ఎపిసోడ్‌ జరుపుకున్నందున.. ఈ డాక్యుమెంటరీ స్వయంశక్తి, సానుకూలత, ప్రజల భాగస్వామ్యానికి సజీవ ఉదాహరణలుగా ఉన్న అసంఖ్యాక భారతీయులను జరుపుకున్న ప్రయాణాన్ని తిరిగి చూపనుంది. ప్రధానమంత్రి.. ఒక కుటుంబ సభ్యుడు లేదా గ్రామ పెద్ద వలె, దేశవ్యాప్తంగా ప్రజలు లేవనెత్తిన సూచనలు, ఆందోళనలను వినిపించడం ద్వారా.. రాజకీయాలకు అతీతంగా నెలవారీ రేడియో కార్యక్రమం దేశంలోని ప్రముఖ శక్తితో టూ-వే కమ్యూనికేషన్ కోసం ఒక వేదికగా ఎలా ఎదిగిందనేది డాక్యూమెంటరీలో చూపించనున్నారు. 

ఈ డాక్యుమెంటరీ.. పౌరులను, ప్రధానమంత్రిని ప్రేరేపించిన కథలను కూడా ముందుకు తెస్తుంది. అయితే ఈ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్.. దుర్గమమైన పర్వత గ్రామాల్లో నివసించే వారి నుంచి రద్దీగా ఉండే నగరాల్లో నివసించే వారి వరకు ప్రతిచోటా భారతీయుల జీవితాలపై చూపిన ప్రభావం నిజంగా ప్రత్యేకమైనది.

మన్ కీ బాత్ మహిళా సాధికారత, అందరికీ విద్య నుంచి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ వరకు అనేక రకాల సమస్యలను ప్రస్తావించింది. డాక్యమెంటరీలో చూపినట్టుగా.. దేశీయ పర్యాటకాన్ని పెంచడానికి కూడా మన్ కీ బాత్ దారితీసింది. ఇది యోగా, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రజాదరణకు గణనీయంగా దోహదపడింది.

అంతేకాకుండా.. కరోనావైరస్ మహమ్మారి సమయంలో.. భయాందోళనలను తగ్గించడానికి, అసంఖ్యాకమైన ప్రాణాలను రక్షించే ప్రామాణికమైన, నిజమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ‘మన్ కీ బాత్’ అండగా నిలిచింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు