కేరళలో అర్దరాత్రి రైలు బోగీలో చెలరేగిన మంటలు.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం తేలింది..? (వీడియో)

Published : Jun 01, 2023, 09:49 AM IST
కేరళలో అర్దరాత్రి రైలు బోగీలో చెలరేగిన మంటలు.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం తేలింది..? (వీడియో)

సారాంశం

కేరళలో ఓ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున కన్నూర్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి.

కేరళలో ఓ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున కన్నూర్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో రైలులోని ఒక కోచ్ దగ్ధమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక కోచ్‌లో మంటలు చెలరేగడంతో రైలులోని ఇతర కోచ్‌లను దాని  నుంచి విడదీశారు. 

తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి కోచ్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అయితే గుర్తుతెలియని పెట్రోల్ లాంటి ఇంధనం పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్ 2న కోజికోడ్ జిల్లాలో ఎలత్తూర్ సమీపంలో ఇదే రైలులో  షారూఖ్‌ సైఫీ అనే వ్యక్తి  తోటి ప్రయాణికులు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక శిశువుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, రైల్వే చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu