హరప్పా నాగరికతకు సజీవ సాక్ష్యం.. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

Siva Kodati |  
Published : Jul 27, 2021, 04:35 PM ISTUpdated : Jul 27, 2021, 04:46 PM IST
హరప్పా నాగరికతకు సజీవ సాక్ష్యం.. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

సారాంశం

గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత విలసిల్లన పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

భారతదేశంలో మరో ప్రఖ్యాత ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత విలసిల్లన పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెంది. క్రీస్తూ పూర్వం 1800లలో ఈ పట్టణాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

ధోలవిరా.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉంది. 5 వేల ఏళ్లకు పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ధోలవిరా ఐదో అతిపెద్దది కావడం విశేషం.   

Also Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు

ఇక గత ఆదివారం తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ తర్వాత రెండు రోజులకే మరో భారతీయ పర్యాటక ప్రాంతానికి యునెస్కో గుర్తింపు దక్కడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !