ఇంటి ముందు నీళ్లు పారబోశాడని దళితుడి హత్య.. మైనర్ బాలికకూ గాయాలు

Published : Oct 12, 2023, 06:21 PM IST
ఇంటి ముందు నీళ్లు పారబోశాడని దళితుడి హత్య.. మైనర్ బాలికకూ గాయాలు

సారాంశం

ఇంటి ముందు నీళ్లు పారబోశాడని ఓ దళిత వ్యక్తిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చి చంపగా ఆ దళితుడు స్పాట్‌లోనే మరణించాడు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాలా చిన్న వివాదానికి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కౌసాంబి జిల్లాలో జరిగింది. పొరుగునే ఉండే దళితుడు తన ఇంటి ముందు నీటిని కుమ్మరించిపోయాడని నిందితుడు ఆగ్రహించాడు. అంతేకాదు, ఇంటిలో నుంచి పిస్టల్ తీసుకువచ్చి ఆ దళితుడిని చంపేశాడు.

సైని పోలీసు స్టేషన్ పరిధిలోని దుమాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్పీ సమర్ బహదూర్ సింగ్ ఈ ఘటన గురించి వివరించారు. 35 ఏళ్ల రామనెవాజ్ రాయిదాస్‌ను రాహుల్ విశ్వకర్మ చంపేశాడని తెలిపారు.

Also Read: ఎన్నికలను బహిష్కరించిన ఆ రెండు గ్రామాలు.. ‘ఇప్పటికీ కనీస వసతులు లేవు’

బుధవారం రాత్రి రాహుల్ ఇంటి ముందు రాయిదాస్ నీళ్లు ఒలకబోశాడు. దీన్ని రాహుల్ అడ్డుకున్నాడు. ఈ చిన్న వాదం గొడవగా మారింది. ఆగ్రహంతో రాహుల్ తుపాకీ తీసుకువచ్చి రాయిదాస్‌ను కాల్చేశాడు. దీంతో రాయిదాస్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటనలో 16 ఏళ్ల మైనర్ బాలిక కూడా గాయపడింది.

ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 కింద, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. రాయిదాస్‌ను కాల్చి చంపిన తర్వాత రాహుల్ పారిపోయాడు. ప్రస్తుతం రాహుల్‌ను గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?