తీవ్ర తుఫానుగా 'మోచా'.. భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : May 11, 2023, 02:19 PM IST
తీవ్ర తుఫానుగా 'మోచా'.. భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

Cyclone Mocha: బంగాళాఖాతంలో 'మోచా సైక్లోన్' తీవ్ర తుఫానుగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతో అండమాన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోచా తుఫాను గురువారం రాత్రి తీవ్ర తుఫానుగా మారనుంది. మే 13 నాటికి దీని తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ బెంగాల్ ను తాకకపోవచ్చని ఇదే స‌మ‌యంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.   

Cyclone Mocha: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాత్రికి రాత్రే తుఫానుగా మారిందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అధికారులు గురువారం తెలిపారు. మోచా తుఫాను బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్, మయన్మార్ లోని సిట్వే మధ్య ఉన్న ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. మోచా తుఫాను ప్ర‌భావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ సమయానికి తుఫాను పశ్చిమ బెంగాల్ ను తాకుతుందని తొలుత అంచనా వేశారు. అయితే తుఫాను ఇప్పుడు స్పష్టంగా తూర్పు దిశగా కదులుతోంది. గురువారం రాత్రికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే 13వ తేదీ సాయంత్రానికి దీని తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఈ తుఫాను బలహీనపడి కాక్స్ బజార్, క్యూక్ప్యూ మధ్య నైరుతి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాలను దాటనుంది. ఈ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు దూసుకెళ్లవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గా ఉందని ఐఎండీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితులు సముద్రం తూర్పు మధ్య భాగంలో వ్యవస్థ (తుఫాను)ను మరింత తీవ్రతరం చేయడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. స‌ముద్రంలో లోకి వెళ్ల‌వ‌ద్ద‌నీ, ఆయా ప్రాంతాల్లో ప‌లు కార్య‌క‌లాపాలు మానుకోవాల‌ని సూచించింది. 

కాగా, మోచా తుఫాను భారత ప్రధాన భూభాగాన్ని తాకే అవకాశం లేనప్పటికీ, ఇది ఇప్పటికీ  ఢిల్లీ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మే 14 నుంచి 17 వరకు పగటిపూట ఉపరితల గాలులు బలంగా వీస్తాయని తెలిపింది.

అలాగే, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటుతుందని స‌మాచారం. క‌నిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నోయిడాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu