మంత్రుల కన్నా ఆవులే మేలు.. పినరయి ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు..

Published : Feb 09, 2023, 11:58 PM IST
మంత్రుల కన్నా ఆవులే మేలు.. పినరయి ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు..

సారాంశం

కేరళలోని పినరయి ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రజలకు ఆవులే ఎక్కువ సహకారం అందిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ అన్నారు. ఆవు వల్ల కనీసం వ్యవసాయం కూడా బాగుపడుతోంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తోందని సురేంద్రన్ ప్రశ్నించారు. ప్రేమికుల రోజును 'కౌ హగ్గింగ్ డే'గా నిర్వహించాలన్న యానిమర్ వెల్ఫేర్ బోర్డ్ ఆప్ ఇండియా  సూచనపై సురేంద్రన్ స్పందించారు.

కేరళలో సీఎం పినరయి విజయన్ వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం కంటే ఆవులే ప్రజలకు ఎక్కువ మేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కేరళకు ఆవుల వల్ల ఎక్కువ ఆదాయం సమకూరుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని జంతు సంక్షేమ బోర్డు చేసిన విజ్ఞప్తిని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ గురువారం స్వాగతించారు. పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం కంటే ఆవులు రాష్ట్రంలోని ప్రజలకు ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు. ప్రేమికుల రోజు అదే రోజున కౌ హగ్ డే జరుపుకోవడంపై సురేంద్రన్ మాట్లాడుతూ.. మీరు ప్రేమికుల రోజున ప్రేమను పంచుకోవచ్చని, దాని గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదనీ, ఆవులను గౌరవించమని మాత్రమే సూచిస్తున్నామని తెలిపారు.

ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ని జరుపుకోవాలని, ఆవులు భావోద్వేగ సంపద, సామూహిక ఆనందాన్ని ఇస్తాయని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా బుధవారం విజ్ఞప్తి చేసింది. ఆవు.. భారతీయ సంస్కృతికి , గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద , జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మనందరికీ తెలుసు. తల్లి, దాత వంటి దాని పోషక స్వభావం కారణంగా దీనిని 'కామధేను', 'గౌమాత' అని పిలుస్తారు. అన్నింటికంటే, మానవాళికి సంపదను అందిస్తుందని  బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

పాశ్చాత్య సంస్కృతి పురోగమిస్తున్న వేళ..  వైదిక సంప్రదాయాలను రక్షించుకోవడానికి  ఆవును సంరక్షించాలని బోర్డు పేర్కొంది. పాశ్చాత్య నాగరికత  సమ్మోహనం మన భౌతిక సంస్కృతి, వారసత్వాన్ని దాదాపు మరచిపోయేలా చేసిందని బోర్డు పేర్కొంది. అందుకే, ఆవు ప్రేమికులందరూ ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా జరుపుకోవాలనీ, ఆవు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జీవితాన్ని సంతోషంగా, సానుకూల శక్తితో నింపండని పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం