గతేడాది 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం

Published : Feb 09, 2023, 08:00 PM IST
గతేడాది 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం

సారాంశం

గతేడాది అత్యధికంగా 2.25 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2011 నుంచి 2022 వరకు మొత్తం సుమారు 16 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారని తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా గతేడాది పౌరసత్వం త్యజించినట్టు వివరించింది.  

న్యూఢిల్లీ: 2011 నుంచి గతేడాది వరకు సుమారు 16 లక్షల మంది భారత పౌరులు తమ పౌరసత్వాన్ని వదిలిపెట్టుకున్నారు. అప్పటి నుంచి అత్యధికంగా గతేడాదే భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2020లో ఈ సంఖ్య(85,256) తక్కువగా ఉన్నది. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్  పౌరసత్వాన్ని త్యజించుకున్న వారి సంఖ్య సంవత్సరాలవారీగా వివరాలు వెల్లడించారు.

2015లో 1,31,489 మంది ఇండియన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టుకున్నారు. 2018లో ఈ సంఖ్య 1,34,561గా ఉండగా, 2019లో 1,44,017గా, 2021లో 1,63,370 మంది ఇండియన్ సిటిజెన్‌షిప్‌ను వదిలేసుకున్నారు. కాగా, 2022లో గరిష్టంగా 2,25,620 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టుకున్నారు.

Also Read: 41 మంది భారతీయులకు గతేడాది పాకిస్తాన్ పౌరసత్వం.. ఈ సంఖ్య ఎందుకు పెరిగింది?

కాగా, రిఫెన్స్ కోసం కేంద్ర మంత్రి జైశంకర్ 2011 (1,22,819), 2012 (1,20,923), 2013 (1,31,405), 2014 (1,29,328)ల వివరాలనూ ఆయన వెల్లడించారు.

ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఎంత మంది ఉన్నారని అడగ్గా.. గత మూడేళ్లలో యూఏఈ పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య ఐదు అని సమాధానం ఇచ్చారు. అలాగే, ఇక్కడ పౌరసత్వం వదిలిపెట్టి వారు సిటిజెన్‌షిప్ పొందిన 135 దేశాల జాబితానూ ఆయన వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!