ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన

By narsimha lodeFirst Published Mar 8, 2024, 9:01 AM IST
Highlights

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్టుగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్  ధరను రూ. 100 తగ్గిస్తున్నట్టుగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారంనాడు ప్రకటించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా  మోడీ తెలిపారు.

 

Today, on Women's Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti.

By making cooking gas more affordable, we also aim…

— Narendra Modi (@narendramodi)

సోషల్ మీడియా వేదికగా  ప్రధాని ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.వంట గ్యాస్ ను మరింత చౌకగా మహిళలకు అందించడం ద్వారా   ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినట్టుగా  మోడీ చెప్పారు ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఇచ్చే ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీపై రూ. 300 పథకాన్ని పొడిగిస్తూ  గురువారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

 

Greetings on International Women's Day! We salute the strength, courage, and resilience of our Nari Shakti and laud their accomplishments across various fields. Our government is committed to empowering women through initiatives in education, entrepreneurship, agriculture,…

— Narendra Modi (@narendramodi)

మహిళలకు సాధికారిత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో పోస్టులో  మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. నారీ శక్తి బలం, ధైర్యానికి అభివాదం చేస్తున్నామన్నారు.విద్య,వ్యవసాయం, టెక్నాలజీ వంటి అంశాల్లో మహిళలకు సాధికారిత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు.గత దశాబ్దంలో  ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇది కూడ ప్రతిబింబిస్తుందని మోడీ పేర్కొన్నారు.
 

click me!