BREAKING: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో బాంబర్ అరెస్ట్!

By Rajesh KarampooriFirst Published Apr 12, 2024, 9:42 AM IST
Highlights

Rameshwaram Cafe: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

Rameshwaram Cafe:  దేశవ్యాప్తంగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ ‌(Rameshwaram Cafe)లో పేలుడు ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో కీలక పురోగతి జరిగింది.బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.

అరెస్టయిన షాజిబ్ హుస్సేన్ కేఫ్ ప్రాంగణంలో బాంబును అమర్చడంలో కీలకంగా వ్యవహరించారు.  నిశిత దర్యాప్తు, నిఘా  తర్వాత NIA బృందం విజయం సాధించింది. చాలా నెలలుగా పరారీలో ఉన్న ఉగ్రవాదిని హుస్సేన్‌ను పట్టుకుంది. అతను అస్సాం మరియు పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

click me!