బాయ్ ఫ్రెండ్ మోసం: నగ్న చిత్రాలు తీసి, తన మిత్రులతో పడుకోవాలని ప్రేయసిపై ఒత్తిడి

By telugu teamFirst Published Aug 2, 2021, 8:07 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ప్రేమించానని నమ్మించి ఓ యువతిని యువకుడు బ్లాక్ మెయిల్ చేశాడు. తన మిత్రులతో పడుకోవాలని ఒత్తిడి చేశాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించానని నమ్మించి ఓ యువతిని ఓ యువకుడు అత్యంత నీచంగా వ్యవహరించాడు. దాంతో బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ప్రయత్నంలో పెరాలిసిస్ వచ్చింది. 

ఆత్మహత్య చేసుకోవడానికి యువతి వంతెనపై నుంచి దూకింది. అయితే ఆమె ప్రాణాలు కోల్పోలేదు. కానీ నడుముల నుంచి కింది భాగం చలనం లేకుండా పోయింది. ఈ సంఘటన మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. ఈ విషయంపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

షాదాబ్ అనే యువకుడితో తాను నాలుగు నెలలుగా సంబంధంలో ఉన్నానని, తామిద్దరం తమ కజిన్ ఇంట్లో కలుస్తూ ఉండేవాళ్లమని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తెలిపింది. అతను అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు తీసి తన మిత్రులకు పంపించాడని, ఆ తర్వాత అకస్మాత్తుగా తనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. 

తన మిత్రులతో శృంగారం చేయడానికి అంగీకరించాలని లేదంటే రూ. 50 వేలు ఇవ్వాలని ఆ యువకుడు ఆమెను బెదిరిస్తూ వచ్చాడు. అలా చేయకపోతే వీడియోలను ఇంటర్నెట్ లో పెడుతానని హెచ్చరించాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక వంతెనపై నుంచి దూకింది.

పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని, కుటుంబ సభ్యుల ఫిర్యాదును తీసుకుని కేసు నమోదు చేశారు. షాదాబ్ మీద, అతని ముగ్గురు మిత్రులు సద్దాం, రషీద్, ఆరిఫ్ మీద కేసులు పెట్టారు. బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగం మోపారు. 

సంఘటన జరిగిన తర్వాత నలుగురు మిత్రులు కూడా పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు బాలిక కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయని, ఇతర భాగాలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెప్పారు. 

click me!