బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Published : Feb 03, 2023, 02:11 PM ISTUpdated : Feb 03, 2023, 02:18 PM IST
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

సారాంశం

పిఎం మోడీపై వచ్చిన బిబిసి డాక్యుమెంటరీని బ్లాక్ చేయడానికి, సోషల్ మీడియా నుండి లింక్‌లను తొలగించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. దీనిమీద సుప్రీకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం ఆరోపణలపై దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ డాక్యుమెంటరీని పబ్లిక్ డొమైన్ నుండి తీసివేయాలని ఆదేశించిన అసలు రికార్డును కోరింది.

డాక్యుమెంటరీని బ్లాక్ చేయడానికి, సోషల్ మీడియా నుండి లింక్‌లను తీసివేయడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషన్‌లు సవాలు చేశాయి. బ్లాక్ చేసే ఉత్తర్వును కేంద్రం ఎప్పుడూ అధికారికంగా ప్రచారం చేయలేదు, రెండు భాగాల డాక్యుమెంటరీపై నిషేధాన్ని "దుష్ప్రవర్తన, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌లో పేర్కొంది. ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, కార్యకర్త-లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.

బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వ నిషేధం.. పలు పిటిషన్లను విచారించనున్న సుప్రీం

జనవరి 21న, కేంద్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 కింద అత్యవసర నిబంధనలను ఉపయోగించి, వివాదాస్పద డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" లింక్‌లను పంచుకునే బహుళ యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. నిషేధం తర్వాత, రెండు భాగాల బీబీసీ  సిరీస్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాతో సహా వివిధ ప్రతిపక్ష నాయకులు షేర్ చేసుకున్నారు. విద్యార్థుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు బహిరంగ ప్రదర్శనలను నిర్వహించాయి.

స్క్రీనింగ్‌లకు అనుమతించకపోవడంతో అనేక క్యాంపస్‌లలో విద్యార్థులు కళాశాల అధికారులు, పోలీసులతో ఘర్షణ పడ్డారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని, కాసేపు విడిచిపెట్టారు. బీబీసీ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్‌ను బ్లాక్ చేయమని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్‌లకు తెలిపింది. ఇంగ్లండ్ లో ఉణ్న భారత సంతతి వారు కూడా దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. జనవరి 21న కేంద్ర ఐటీరూల్స్ 2001 ప్రకారం ట్విట్టర్, యూట్యూబ్‌లలో డాక్యుమెంటరీలను విశేషాధికాలను ఉపయోగించి తొలగించింది. 
ఫిబ్రవరి 2002లో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ తప్పు చేశారన్న ఆధారాలు సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తులో దొరకలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?