‘నా భార్యకు భరణం ఇవ్వాలి.. కిడ్నీ అమ్మేస్తా కొనండి.. లేదంటే ఆత్మాహుతి కార్యక్రమమే...’

Published : Mar 01, 2023, 10:04 AM IST
‘నా భార్యకు భరణం ఇవ్వాలి.. కిడ్నీ అమ్మేస్తా కొనండి.. లేదంటే ఆత్మాహుతి కార్యక్రమమే...’

సారాంశం

భార్యకు భరణం ఇవ్వడం కోసం కిడ్నీ అమ్ముకుంటున్నానని ఓ వ్యక్తి బ్యానర్ పట్టుకుని తిరగడం హర్యానా రోడ్ల మీద కనిపించింది. 

హర్యానా : హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తి ఓ విచిత్రమైన బ్యానర్ తో రోడ్లమీద తిరుగుతూ చర్చనీయాంశంగా మారాడు. ఇంతకీ ఆ బ్యానర్ పై ఏం రాసి ఉందంటే ‘అమ్మకానికి సిద్ధంగా మూత్రపిండం’, ‘ఆత్మాహుతి కార్యక్రమం మార్చి 21న’ ఇది బ్యానర్ కు రెండువైపులా రాసి ఉంది.  ఈ బ్యానర్ను పట్టుకొని ఓ వ్యక్తి హర్యానాలోని ఫరీదాబాద్ రోడ్లమీద తిరుగుతున్నాడు. చూసిన వారంతా విషయం ఏంటో తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తున్నారు. ఆత్మహత్య కార్యక్రమం అంటే ఏంటి?  మూత్రపిండం అమ్ముకోవడం ఏమిటి? అనేది అందరి మనసులోని ప్రశ్న.

ఇటీవలి కాలంలో భార్యాబాధితుల సంఘాలు, భార్యాబాధితుల నిరసనలు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. భార్యలు, ఆమె పుట్టింటివారు వేదింపులకు గురి చేస్తున్నారంటూ చాలామంది భర్తలు అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. అవన్నింటి వెనుక వాస్తవాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన మాత్రం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. హర్యాణాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..  

రామచరిత్మానస్‌లో కొంత మురికి ఉంది..దానిని తొలగించాలి- బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఓ వ్యక్తి కిడ్నీ అమ్ముకుంటానని, లేదంటే ఆత్మహత్య శరణ్యం అంటూ ఓ బ్యానర్ తో తిరుగుతున్నాడు. ఈ బ్యానర్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి పేరు సంజీవ్. అతను  బీహార్ రాజధాని  పాట్నాకు చెందిన వ్యక్తి. సంజీవ్ కు ఆరేళ్ల కిందట పెళ్లయింది.  అప్పటినుంచి భార్య, బావమరిది, అత్తమామల నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి.  వీటిని భరించలేక విడాకులు కోరితే..  తాను విడాకులు ఇవ్వాలంటే పది లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేస్తుందని  సదరు బాదితుడైన సంజీవ్  చెబుతున్నాడు.

దీంతో తనకు ఈ బాధల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా పోలీసులను అధికారులను అనేకసార్లు సంప్రదించాడు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఇలా బ్యానరు తయారు చేసుకుని తిరుగుతున్నానని తెలిపాడు. మార్చి 21లోగా తన కిడ్నీ అమ్మ గలిగితే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని.. అలా జరగని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. 21 వరకు తన కిడ్నీ అమ్ముడుపోకపోతే జరిగే ఆత్మహుతి కార్యక్రమం తన స్వస్థలమైన పాట్నాలో ఉంటుందని తెలిపాడు.

ఈ ఆత్మహత్య కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు ఆహ్వానం పలుకుతూ వారి పేర్లను కూడా బ్యానర్లో ఒకవైపు ముద్రించాడు. మరోవైపు తన ఈ స్థితికి కారణమైన భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫోటోలను ప్రింట్ చేయించాడు. ఈ బ్యానర్ పట్టుకుని వినూత్నంగా నిరసన తెలుపుతున్నాడు. అతనికి ఏం న్యాయం జరుగుతుందో చూడాల్సిందే. 

 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu