బాబా రామ్దేవ్ పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్ ఇప్పటికే అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతోందని, యుద్ధం జరిగితే భారత్ ముందు నాలుగు రోజులు కూడా నిలబడలేదని హెచ్చరించారు. త్వరలోనే లాహోర్ లేదా కరాచీలో గురుకులం ఏర్పాటుచేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాబా రామ్దేవ్ పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించారు. భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్దేవ్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇప్పటికే అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతోందని, యుద్ధం జరిగితే భారత్ ముందు నాలుగు రోజులు కూడా నిలబడలేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కరాచీలో గురుకులం ప్రారంభిస్తామని, ఆ తర్వాత లాహోర్లో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాకిస్థాన్ స్వయంగా విడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
యోగా గురువు బాబా రామ్దేవ్ ఆదివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'సంస్కృతి జాగరణ మహోత్సవ్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ స్వయంగా విడిపోయే దశలో ఉందని, పఖ్తున్, బలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతాల పరిస్థితి పాక్ ఆక్రమిత కశ్మీర్ కంటే దారుణంగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే శక్తి లేదని, యుద్ధం జరిగితే పాకిస్థాన్ భారత్ ముందు నాలుగు రోజులు కూడా నిలబడలేదని అన్నారు.రాబోయే రోజుల్లో కరాచీ, ఆ తర్వాత లాహోర్లో గురుకులాలను ప్రారంభించాలని బాబా రామ్దేవ్ పిలుపునిచ్చారు.
బిజెపి జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి పాకిస్థాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇప్పుడు తన సైన్యంపై కూడా నమ్మకం కోల్పోయిందని, భారత్ ప్రతిచర్యకు భయపడుతోందని అన్నారు. భారత్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిస్పందించలేదని, భారత్ కఠినంగా వ్యవహరిస్తే ఉగ్రవాదానికి మూలకారకులు ముక్కలు ముక్కలు అవుతారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, దాని సూత్రధారులను శిక్షించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.