కేరళలో దారుణం.. మరో యువకుడితో ఫోన్ లో మాట్లాడుతోందని ప్రేయసిని హత్య చేసిన ప్రేమికుడు..

By team teluguFirst Published Dec 28, 2022, 2:59 PM IST
Highlights

కేరళలో దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రేయసి వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోందని కోపం పెంచుకున్న ప్రేమికుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


వేరే యువకుడితో సన్నిహితంగా మెలుగుతోందనే అనుమానంతో ఓ యవతిని ఆమె ప్రేమికుడు హత్య చేశాడు. ఈ దారుణం కేరళలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని స‌ర్కారు : కేంద్రంపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఫైర్

కేరళ రాష్ట్రం వర్కాల నగరంలోని వడస్సేరికోణం ప్రాంతానికి చెందిన  సజీవ్, షాలిని దంపతులకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె గోపు అనే యువకుడితో కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉంది. అయితే గోపు కొంత కాలం నుంచి ఆమెను అనుమానిస్తున్నాడు. వేరే యువకుడితో సన్నిహితంగా మెలుగుతోందా అనే అనుమానం అతడికి కలిగింది. దీంతో ఆమెను పరీక్షించేందుకు గోపు వేరే వ్యక్తిలా ఆమెకు ఫోన్ చేశాడు. దీంతో వారి మధ్య పరిచయం పరిగింది. 

కానీ తనకు ఫోన్ చేస్తోంది గోపు అని తెలియక ఆమె అతడితో రెగ్యులర్ గా మాట్లాడటం మొదలుపెట్టింది. దీంతో ఆ యువకుడికి కోపం వచ్చింది. తనను ప్రేమికురాలు మోసం చేస్తోందని ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామన కలుద్దాం రమ్మని వేరే యువకుడిలా గోపు ఆ యువతికి కాల్ చేశాడు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో గోపు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. తన ప్రేమికుడే ఇలా వేరే యువకుడిలా తనకు కాల్ చేశాడని, ఇదంతా అతడి పనే అని ఆమె తెలుసుకుంది.

దేశంలోని చిన్న రైల్వే స్టేషన్‌లపై కేంద్రం ఫోకస్.. కొత్తగా పథకం, 200 స్టేషన్లలో ఆధునికీకరణ పనులు

ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గోపు ఆగ్రహంతో తన వద్ద ఉన్న కత్తితో ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. అలాగే తన ఇంటికి వెళ్లి తలుపుకొట్టింది. తల్లిదండ్రులు వచ్చి తలుపు తీశారు. ఆమె మెడ నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్నట్లు వారు గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది.

భారతదేశం విచ్చిన్నమైంది - కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

కాగా.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. మొబైల్ ఫోన్ వివరాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా గోపును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోందని పోలీసులు చెప్పారు. 

click me!