మళ్లీ కుండపోత వర్షం.. అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్

Siva Kodati |  
Published : Jul 26, 2022, 04:52 PM IST
మళ్లీ కుండపోత వర్షం.. అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్

సారాంశం

అమర్‌నాథ్ యాత్రను అధికారులు మరోసారి నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 4 వేల మంది యాత్రికులను అధికారులు సురిక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో యాత్రను నిలిపివేశారు అధికారులు. 4 వేల మంది యాత్రికులను అధికారులు సురక్షితంగా తరలించారు. ఇక ... గత శుక్రవారం కూడా అమర్‌నాథ్ యాత్రను అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాంబన్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. 

Also REad:మళ్లీ కుండపోత.. అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్ : ఐటీబీపీ

దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలోని 3,880 మీటర్ల ఎత్తైన గుహ పుణ్యక్షేత్రానికి 43 రోజుల సుదీర్ఘ యాత్ర జూన్ 30న జంట ట్రాక్‌ల నుండి ప్రారంభమైంది.  దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సాంప్రదాయ 48-కిమీ నున్వాన్-పహల్గామ్ మార్గం, 14-కిమీ పొట్టి బల్తాల్,  మధ్య కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా మ‌ధ్య యాత్ర కొన‌సాగ‌నుంది. ఇప్పటివరకు 1.20 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్ట్ 11న రక్షా బంధన్‌తో పాటు 'శ్రావణ పూర్ణిమ' సందర్భంగా ఈ పాదయాత్ర ముగియనుంది.
 


 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్