Operation Sindoor: పాక్ పై భారత్ విజయం.. యుద్ధ విమానాల దాడిపై ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

Published : Aug 09, 2025, 01:25 PM IST
Air Chief Marshal AP Singh

సారాంశం

Operation Sindoor:భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 రక్షణ వ్యవస్థ ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చి కీలక విజయాన్ని సాధించింది. మురిద్కేలష్కర్ ప్రధాన కార్యాలయాలపై జరిగిన దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని వైమానిక దళ చీఫ్ ఎపి సింగ్ వెల్లడించారు. 

Operation Sindoor: పాక్ పై ప్రతికార దాడిగా భారత వాయువ్య దళం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందనీ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ తెలిపారు, ఎస్-400 గేమ్-ఛేంజర్ రక్షణ వ్యవస్థ ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసి, భారత వైమానిక శక్తిని ప్రపంచ దేశాలను చాటి చూపామని అన్నారు. మురిద్కే-లష్కర్ ప్రాంతాల్లో పాకిస్థానీ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలపై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని, ఆ ప్రాంతం గురించి ప్రత్యేక సమాచారం, ఉపగ్రహ చిత్రాలతో వైమానిక దళం సాయుధంగా వివరించింది.

భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. మురిద్కే-లష్కర్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ముందు, తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శిస్తూ, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అపూర్వమైన ప్రతిభను చూపించాయని తెలిపారు.

రక్షణ వ్యవస్థలలో ఎస్-400 సిస్టమ్ గేమ్-ఛేంజర్‌గా మారిందని ఎపి సింగ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ఐదు పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేయడం సాధ్యమైంది. ఎస్-400 పరిధి కారణంగా పాకిస్తానీ విమానాలు భారత వైమానిక రక్షణ వ్యవస్థకు సమీపించలేకపోయాయని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !