ఢిల్లీలోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి:పోలీసుల తీరుపై ఎంపీ ఫైర్

Published : Aug 14, 2023, 05:16 PM ISTUpdated : Aug 14, 2023, 05:39 PM IST
ఢిల్లీలోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి:పోలీసుల తీరుపై  ఎంపీ ఫైర్

సారాంశం

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన న్యూఢిల్లీలోని ఇంటిపై గుర్తు తెలియని దుండగులు  దాడికి పాల్పడ్డారు.

న్యూఢిల్లీ:  ఎంఐఎం  చీఫ్, ఎంపీ  అసదుద్దీన్ ఓవైసీ  న్యూఢిల్లీలోని ఇంటిపై  గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు.  ఈ ఘటనలో  ఇంటి కిటికీలు,  ఏసీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఐదు రోజుల క్రితం  తనకు  బెదిరింపు మేసేజ్ లు వచ్చినట్టుగా ఓవైసీ గుర్తు చేశారు.  ఈ విషయమై  తాను  పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 20న  ఎంఐఎం చీఫ్ అసద్ నివాసంపై  రాళ్ల దాడి జరిగింది.ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదు. న్యూఢిల్లీలోని ఆశోక్ రోడ్డులో గల ఇంటిపై  దుండగులు రాళ్లతో దాడికి దిగారు. సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య ఈ దాడి జరిగిందని  అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియాలో ప్రకటించారు.రాళ్ల దాడి తర్వాత తన ఇంటి పరిస్థితిని వివరిస్తూ ట్విట్టర్ లో  ఆయన వీడియో షేర్ చేశారు.2014 నుండి  అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరగడం ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దాడి నాలుగో దాడిగా  అప్పట్లో  అసదుద్దీన్ ఓవైసీ  పేర్కొన్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఎవరీ ప్రహ్లాద్ జోషి.? మోదీ ఈయననే కొత్త విద్యా శాఖ మంత్రిగా ఎందుకు సెలక్ట్ చేశారు.?
NEET Leak: ఎట్టకేలకు ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌.. కేంద్రంతో చ‌ర్చ‌ల అనంత‌రం కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న