ప్రచారం చేయను..చెన్నైకి చెక్కేస్తా.. నమిత ఆగ్రహం.. అయినా జాడలేని అభ్యర్థి.. !

By AN TeluguFirst Published Apr 3, 2021, 1:06 PM IST
Highlights

బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నమితకు చేదు అనుభవం ఎదురైంది. తానెవరికోసం ప్రచారం చేయడానికి వెళ్లిందో ఆ అభ్యర్థే కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయారు. ప్రచారం గిచారం జాంతానై.. ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా.. అంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నమితకు చేదు అనుభవం ఎదురైంది. తానెవరికోసం ప్రచారం చేయడానికి వెళ్లిందో ఆ అభ్యర్థే కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయారు. ప్రచారం గిచారం జాంతానై.. ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా.. అంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

ఈ ఘటన రామనాథపురం లో జరిగింది. అసలు విషయం ఏంటంటే... బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చీరాని తమిళంలో.. టీవీలో మాట్లాడినట్లు మచ్చా అంటూ నమిత చెబుతున్న మాటలు అర్థం కాకపోయినా.. కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు.

ఈ నేపథ్యంలో.. రామనాథపురం బీజేపీ అభ్యర్థి కుప్పు రాముకు మద్దతుగా నమితా గురువారం రామేశ్వరం మున్సిపాలిటీలో నాలుగు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిదిన్నరకు మరుదు పాండియన్ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. అయితే 10.15 గంటలకు కూడా అభ్యర్ధి రాలేదు.

దీంతో మరుదు పాండియన్ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత, బస్టాండ్, దేవర్ విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికి కూడా అభ్యర్థి రాకపోవడంతో  ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకుని హోటల్ కి వెళ్లిపోయారు.

సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో ఆగ్రహించిన నమిత అభ్యర్థి లేకుండా ప్రచారం చేయబోనని.. ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నైనా ఆ అభ్యర్థి పట్టించుకుంటాడో లేదో..

click me!