సడెన్ గా బ్రేకులు వేయడంతో ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Published : Nov 12, 2023, 05:27 PM IST
సడెన్ గా బ్రేకులు వేయడంతో ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సారాంశం

రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఓ ట్రక్కు సడెన్ గా బ్రేకులు వేయడంతో దాని వెనకాల ఉన్న కారు వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని 52వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం అక్కడికక్కడే మరణించింది. ఈ కుటుంబం పుష్కర్ కు వెళ్తుండగా హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కల్తీ మద్యం తాగి 18 మంది మృతి.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?

వివరాలు ఇళా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా జిల్లాలోని గంగుఖేడి గ్రామానికి చెందిన దేవీ సింగ్ (50), అతడి భార్య మాన్ఖోర్ కన్వర్ (45), అతడి సోదరుడు రాజారామ్ (40), మేనల్లుడు జితేంద్ర (20) ఓ కారులో రాజస్థాన్ లోని పుష్కర్ కు బయలుదేరింది. ఆ కారు నేషనల్ హైవే నెంబర్ 52పై ప్రయాణిస్తూ ఆదివారం తెలవారుజామున బుండి జిల్లాలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేరుకుంది.

tunnel collapses : కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సొరంగం.. చిక్కుకుపోయిన 36 మంది కార్మికులు..

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తోంది. ఈ కారు ముందు ఓ ట్రక్కు కూడా వెళ్తోంది. అయితే ఆకస్మాత్తుగా ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడంతో వెనకాల ఉన్న కారు దానిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించంతో ఆమె మరణించింది.

Fire in Dal Lake : కాశ్మీర్ లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. ముగ్గురు బంగ్లాదేశీ పర్యాటకులు మృతి

కాగా.. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ ను దాని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరిచామని, బాధిత కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway