భారీ ఎన్‌కౌంటర్...8 మంది మావోలు హతం

Siva Kodati |  
Published : Feb 28, 2019, 04:04 PM IST
భారీ ఎన్‌కౌంటర్...8 మంది మావోలు హతం

సారాంశం

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

అయితే మావోలు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు కూడా ప్రతిఘటించాయి. ఎదురుకాల్పుల్లో సుమారు 8 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరిని ఇంకా గుర్తించాల్సి వుంది. భారీ సంఖ్యలో సహచరులను కోల్పోవడంతో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉండటంతో అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం