యూపీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, 22 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Dec 18, 2022, 9:57 AM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  నోయిడా ఎక్స్‌ప్రెస్  హైవేపై  ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. మరో  22 మంది గాయపడ్డారు.  గాయపడిన వారిని స్థానిక  ఆసుపత్రికి తరలించారు.

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నాలెడ్జ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్  హైవేపై రెండు బస్సులు ఆదివారం నాడు ఢీకొన్నాయి.  ఈ ఘటనలో  ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా  ఉందని  గ్రేటర్ నోయిడా  పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను  పోలీసులు స్థానికంగా  ఉన్న ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.  

దేశంలోని పలు రాష్ట్రాల్లో  రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు సరిగా లేని కారణంగా  కూడ కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.  రోడ్డు ప్రమాదాల్లో  దేశ వ్యాప్తంగా  ప్రతి ఏటా వందల మంది  మృతి చెందుతున్నారు. యూపీలోని  ప్రయాగ్ రాజ్ జిల్లా సైదాబాద్ ప్రాంతంలో  ఈ నెల  17న జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు.  మరో 30 మంది గాయపడ్డారు. ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో  బస్సు అదుపు తప్పి విద్యార్ధులను ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో  30 మంది గాయపడ్డారు.

తెలంగాణ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద  ఈ నెల  16న జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు. డివైడర్  ను ఢీకొని  కారు బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో  కారు పూర్తిగా దగ్దమైంది.  ఈ ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు.ఈ నెల 14న యూపీ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  మరో  21 మంది గాయపడ్డారు.లోయలో బస్సు పడడంతో ఈ ప్రమాదం జరిగింది.కర్ణాటక రాష్ట్రంలోని  శివమొగ్గ జిల్లా  సవలంగ రోడ్డులో  కారు, లారీ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో  ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి చెందారు.  ఈ ప్రమాంలో  మరో విద్యార్ధి గాయపడ్డారు.  ఈ ఘటన ఈ నెల 11న జరిగింది.

also read:నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం: కారు దగ్దం, ఇద్దరు మృతి

ఏపీ రాష్ట్రంలోని  ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఈ నెల  11న జరిగింది. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం  ఉమామహేశ్వరపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్  మండలం చేపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.   కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటన ఈ నెల 10వ తేదీన చోటు చేసుకుంది.


 

click me!