
Army Chopper Crash: అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాలో ఆర్మీ చిరుత హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి అమర్ ఉజాలకు తెలిపారు. చనిపోయిన పైలట్ల మృతదేహాలను లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి , మేజర్ జయంత్ ఎగా గుర్తించారు. క్రాష్ సైట్ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, తుది చర్యలు తీసుకుంటారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్మీ విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ట్వీట్ చేస్తూ, "అరుణాచల్ ప్రదేశ్లోని మాండ్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వివిబి రెడ్డి , మేజర్ జయంత్ ఎలకు లెఫ్టినెంట్ జనరల్ ఆర్పి కలితతో సహా అన్ని స్థాయిల అధికారులు నివాళులర్పించారు." మరణించిన సైనికుల కుటుంబాలకు భారత సైన్యం అండగా నిలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాకు పశ్చిమాన మాండ్లా సమీపంలో సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ గురువారం ఉదయం కూలిపోయింది. జిల్లాలోని సంగే గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యిందని, అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని మిస్సమారీకి వెళ్తోందని సైన్యం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలా సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆర్మీ ఏవియేషన్కు చెందిన చిరుత హెలికాప్టర్కు ATCతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందిందని రక్షణ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. తక్షణం ఆర్మీ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఛాపర్లో సీనియర్ ఆఫీసర్, సిబ్బంది, పైలట్ ఉన్నారు. బోమిడిలాకు పశ్చిమాన మండల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఆ తర్వాత తెలిసింది.
గతేడాది అక్టోబర్లో ఇలాంటి ఘటననే
గతేడాది అక్టోబర్ 5న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత, రిలీఫ్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆపై తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లను బయటకు తీసి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు.
2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు IAF సిబ్బంది మరియు ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. 2022 మార్చ్ నెలలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. జమ్ముకశ్మీర్లోని గురేజ్ సెక్టార్కు చెందిన బారౌమ్ ప్రాంతంలో చీతా హలీకాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో కో పైలట్ మరణించగా, పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు.