అధికారులను చెప్పులతో కొట్టండి.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Jun 7, 2019, 1:34 PM IST
Highlights

మాట వినకపోతే ప్రభుత్వాధికారులను చెప్పులతో కొట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. 

మాట వినకపోతే ప్రభుత్వాధికారులను చెప్పులతో కొట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లలితాపూర్ ఎమ్మెల్యే రామ్ రతన్ కుష్వాహ తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు ఒక నెలలో పని మొదలు పెట్టకపోయినా, మా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేసినా, అక్కడే మీ చెప్పులు తీసి వారిని కొట్టండి. ఎందుకంటే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఎస్పీ, బీఎస్పీలకు విధేయులైన కొందరు అధికారులు ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే మీ పట్ల దురుసుగా వ్యవహరిస్తారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండండి..’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

యూపీ అధికారులపై బీజేపీ నేతలు నోరు జారడం కొత్తేం కాదు. ప్రియాంక రావత్ సహా పలువురు బీజేపీ నేతలు గతంలో ఉన్నతాధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు.

click me!