చనిపోయిన మహిళ గర్భసంచి.. మరో మహిళకు

By ramya neerukondaFirst Published Dec 5, 2018, 3:03 PM IST
Highlights

చనిపోయిన మహిళ గర్భసంచిని.. మరో మహిళకు అమర్చి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రెజిల్ వైద్యులు.  


చనిపోయిన మహిళ గర్భసంచిని.. మరో మహిళకు అమర్చి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రెజిల్ వైద్యులు.  జన్మలో తనకు పిల్లలు పుట్టరు అనుకున్న మహిళ ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది. వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా వైద్యులు భావిస్తున్నారు.ఈ కథనాన్ని ‘ ద లాన్ సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించింది’

పూర్తి వివరాల్లోకి వెళితే... జన్యు లోపం కారణంగా.. ఓ మహిళకు పుట్టుకుతోనే గర్భసంచి లేదు. 4500మందిలో ఒకరికి అరుదుగా వచ్చే మేయర్ రాకిటాన్స్ కీ కస్టర్ హాసర్ అనే సిండ్రోమ్ కారణంగా.. ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే... వివాహానంతరం ఆ మహిళ వైద్యులను సంప్రదించగా.. గర్భాశయ మార్పిడి ద్వారా సాధ్యమౌతుందని చెప్పారు. 

అందుకు ఆమె అంగీకరించడంతో.. 2016లో చనిపోయిన ఓ మహిళ గర్భశాయన్ని ఈ మహిళకు అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు(సిజేరియన్‌ సెక్షన్‌) జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది.

అయితే.. ఇప్పటివరకు చాలా మందికి గర్భాశయ మార్పిడి చేసినా.. చాలా కొద్ది మందిలోనే అది సక్సెస్ అయ్యింది. తొలిసారి ఓ చనిపోయిన మహిళ గర్భాశయాన్ని మార్చి ఆపరేషన్ సక్సెస్ చేయడం చాలా అద్భుతమని వైద్యులు చెబుతున్నారు. 

click me!