తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Nobel peace prize: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో పాక్‌ మాజీ ప్రధాని.. ఎవరు నామినేట్ చేశారంటే

Narender Vaitla | Published : Mar 31, 2025 6:32 PM

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈసారి నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి గాను ఈ నామినేషన్‌ లభించింది..   

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఆయనకు ఈ నామినేషన్ లభించింది. నార్వేలోని రాజకీయ పార్టీ "పార్టియట్ సెంట్రం" సభ్యులు, పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA) అనే సంస్థతో కలిసి ఈ నామినేషన్ చేశారు. "ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం గర్వంగా ఉంది" అని పార్టియట్ సెంట్రం ఒక ప్రకటనలో తెలిపింది.

2019లో కూడా ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. దక్షిణాసియాలో శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషికి ఈ నామినేషన్ లభించింది. ప్రతి సంవత్సరం నార్వే నోబెల్ కమిటీ వందలాది నామినేషన్లు అందుకుంటుంది. ఆ తర్వాత ఎనిమిది నెలలపాటు జరిగిన ఎంపిక ప్రక్రియలో విజేతను నిర్ణయిస్తారు. 

పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) స్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతికి సంబంధించి ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది ఆయనకు శిక్షపడిన నాలుగో ప్రధాన కేసు.

ఇంతకు ముందు ఖాన్ పై ఉన్న ప్రభుత్వ బహుమతులను అమ్మడం, రహస్యాలను లీక్ చేయడం, అక్రమ వివాహం ఆరోపణల కేసుల్లో వచ్చిన శిక్షలను కోర్టులు రద్దు. 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస ఓటుతో ఖాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోయారు. తనపై ఉన్న అన్ని ఆరోపణలను రాజకీయ కుట్రగా ఆయన పలుసార్లు ఖండించారు. 

Read more Articles on
click me!