
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ శనివారం ఉదయం వాటికన్కు చేరుకుని, ఏప్రిల్ 21న 88 సంవత్సరాల వయసులో మరణించిన పోప్ ఫ్రాన్సిస్కు నివాళులు అర్పించారు.
అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభం కాకముందే ఈ దంపతులు సెయింట్ పీటర్స్ బసిలికాలోకి వెళ్లారు. ట్రంప్, మెలానియా పోప్ శవపేటిక వద్ద ప్రార్థనలు చేసి, నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు సుమారు 1,40,000 మంది ప్రజలు సెయింట్ పీటర్స్ స్క్వేర్ చుట్టూ గుమిగూడి 12 సంవత్సరాలు కాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన పోప్ ఫ్రాన్సిస్కు తమ నివాళులు అర్పించారు. సాంప్రదాయ పోప్ అంత్యక్రియల మాదిరిగా కాకుండా, పోప్ అంత్యక్రియల కోసం జింక్తో కప్పబడిన ఒక చెక్క శవపేటికను ఎంచుకున్నారు.
ప్రపంచ నాయకులు, మత నాయకులు, సామాన్యులు సహా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సంతాపం తెలిపారు. కరుణ, దయ సందేశంతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన పోప్కు నివాళులు అర్పించారు.
కాథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న సమయంలో, కొత్త పోప్ ఎంపికపై దృష్టి సారించింది. కొత్త పోప్ను ఎన్నుకోవడానికి కార్డినల్స్ త్వరలో సమావేశమవుతారని వాటికన్ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రక్రియ వచ్చే వారంలో ప్రారంభం కావచ్చు. పోప్ ఫ్రాన్సిస్ సమాధి సెయింట్ పీటర్స్ బసిలికా కింద, అతను ఆరాధించే పోప్ల సమాధుల దగ్గర ఉంటుంది.
ఇక పోప్ అంత్యక్రియల కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ముర్ము వాటికన్ వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్లో పోప్కు శ్రద్ధాంజలి ఘటించారు. ముర్ము వెంట కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషువా డిసౌజా ఉన్నారు. శనివారం వాటికన్ సిటీలో జరిగే పోప్ అంత్యక్రియల్లో పాల్గొని భారత ప్రభుత్వం, ప్రజల తరఫున రాష్ట్రపతి నివాళులు అర్పించారు. దేశాధినేతలు రావడంతో ఇటలీ ప్రభుత్వం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.